‘జెంటిల్‌మేన్’ సెన్సార్ టాక్

నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘జెంటిల్‌మేన్’ సెన్సార్ పూర్తియ్యింది. ఈ నెల 17న విడుదల కానుంది. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకతవంలో తెరకెక్కిన చిత్రమిది. ‘అష్టా చమ్మా’ తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత నాని, మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన చ్రితమిది. ‘ఆదిత్య 369’, ‘వంశానికొక్కడు’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కౄష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సురభి, నివేదా థామస్ కథానాయికలుగా నిర్ణయించారు.

నిర్మాత శివలెంక కౄష్ణ ప్రసాద్ మాట్లాడుతూ “మా చిత్రంలోని పాట్లు, టీజ్ర్‌కు, ట్రైల్ర్‌కు చాలా మంచి స్పందన లభిస్తోంది. మా చిత్రం సెన్సార్ పూర్తయ్యింది. క్లీన్ యు స్ట్రిఫికెట్ వచ్చింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు చాలా మంచి సినిమా చేశామని మెచ్చుకున్నారు. సకుటుంబంగా చూడదగ్గ చిత్రంగా తెరకెక్కించాం. ఈ నెల 17న చిత్రాన్ని ప్రేక్షకులల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. ‘జెంటిల్‌మెన్’ అనే టైటిల్ ఎందుకు పెట్టామని సినిమా చూసి తెలుసుకోవాలి. మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. రీరికార్డింగ్ కూడా హైలైట్‌గా ఉంటుంది. అందమైన రొమాంటిక్ థ్రిల్లర్ ఇది.