పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ కల్కి 2898 ఏడి. మైథిలాజికల్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలో నటించారు. దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జూన్ 27న రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మొదటిరోజు మొదటి షోతోనే పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ దగ్గర ర్యాంప్ ఆడేస్తుంది.
దీంతో ఏ ఇండస్ట్రీలోను నెక్స్ట్ వారంలో కూడా మరో సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మెయిన్ గా నార్త్ లో కల్కి సాలిడ్ నెంబర్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో కల్కి మానియాను చూసి ఓ స్టార్ హీరో తన సినిమాను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ సినిమాతో పోటీ పడడం అంటే రిస్క్ అనే ఉద్దేశంతోనే ఆ సినిమాను వాయిదా వేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరు.. ఆ సినిమా ఏంటి ఒకసారి చూద్దాం.
అజయ్ దేవగణ్, టబ్బు కీలక పాత్రలో నటించిన తాజా మూవీ ” ఔరోన్ మెయిన్ కహన్ దుం తా “. ఈ సినిమాను మొదట కల్కి రిలీజైన వారం తర్వాత రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తుంది. కల్కి ఎఫెక్ట్ కారణంగానే ఈ సినిమా రిలీజ్కి కొంచెం గ్యాప్ ఇచ్చారట మేకర్స్. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమాని నీరజ్ పాండే డైరెక్షన్లో ఫైట్ ఫిలిం వర్క్, ఎన్ హెచ్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.