బాలీవుడ్ యాక్టర్ కత్రినా కైఫ్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. వెంకటేష్ నటించిన మల్లేశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇక కత్రినా కైఫ్ వెండి తెర సాహసాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలతో సమానంగా యాక్షన్ సీన్స్లో నటించి సత్తా చాటుతున్న ఈ బ్యూటీ అడ్వెంచర్స్ సన్నివేశాల్లో తన నటనతో ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. ఇక బైక్ రేసింగ్, కార్ డ్రైవింగ్ లాంటి సన్నివేశాల్లో కత్రినా కనిపించిందంటే థియేటర్లో విజిల్స్ పడడం ఖాయం.
అమ్మడి రైడింగ్ స్పీడ్ కి ఎవరైనా పడిపోవాల్సిందే. ఇక తాజాగా రిలీజ్ అయిన టైగర్ 3 సినిమాలోను టవల్ ఫైట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. మేరీ క్రిస్మస్ మూవీ కోసం కూడా ఎన్నో అడ్వెంచర్స్ చేసిందట. సినిమా ప్రచారం కోసం మిడ్ నైట్ రోడ్ ట్రిప్ కూడా చేసిందట. ఆ విషయాన్ని స్వయంగా తానే వివరించింది. ఇక కత్రినా మాట్లాడుతూ జిందగీ నా మిలేగి దొబార సినిమా టైంలోనే నేను బైక్ డ్రైవింగ్ నేర్చుకున్న.. ఆ టైంలో అర్ధరాత్రి తర్వాత మోటార్ సైకిల్ తీసుకొని రోడ్లపైకి వెళ్ళేదాన్ని స్టార్టింగ్ లో బైక్ రైడ్ నేర్చుకోవడం కోసం స్పెయిన్ లో ఓ ట్రైనింగ్ స్కూల్ కి వెళ్ళా అంటూ చెప్పుకొచ్చింది.
తిరిగి వచ్చిన తర్వాత బాంద్రాలో మా ఇంటి నుంచి యష్రాజ్ స్టూడియో వరకు రైడింగ్ కి వెళ్లే దాన్ని. ఆ టైంలో కూడా ట్రాఫిక్ కారణంగా డ్రైవింగ్ కాస్త కష్టంగానే ఉండేది. తర్వాత నెమ్మదిగా నేర్చేసుకున్నా.. ఇక బైక్ రైడింగ్ కి ఓ వ్యక్తిని పెట్టుకున్నా.. వ్యక్తి ఎవరనేది టాప్ సీక్రెట్ అంటూ వివరించింది. బాగా డ్రైవింగ్ వచ్చిన తర్వాతే రోడ్ ట్రిప్కు వెళ్లే దానిని.. ఏ రోడ్డు అనేది కూడా రహస్యమే.. ఎవరికి చెప్పదలుచుకోలేదు అంటూ వివరించింది. దీంతో కత్రినా కైఫ్ బైక్ రైడింగ్ నేర్చుకునే టైంలో అర్ధరాత్రి రైడింగ్ చేస్తూ ఎన్నో విన్యాసాలు చేసిందని అర్థమవుతుంది.