పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. ఇక బాహుబలి 2 తరువాత ప్రభాస్ నుంచి ఇటువంటి గ్రాండియర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కోసం ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కల నెరవేరింది.
ఇక ఈ భారీ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీని హోంబలె ఫిలిమ్స్ సంస్థ గ్రాండ్గా నిర్మించింది. ఇక అసలు విషయం ఏమిటంటే… సలార్ సూపర్ హిట్ తో అందరి చూపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వైపు మళ్ళింది. ఎందుకంటే సలార్ అనంతరం ప్రశాంత్ నీల్ .. ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
ఇక వీరిద్దరి కాంబోలో రానున్న ఆ మూవీ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇక ప్రస్తుతం తారక్.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ” దేవర ” మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ కెరీర్ 31వ మూవీ ని.. మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్గా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.