మహానటి సావిత్రి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె అందంతో, నటనతో ఆతరం అభిమానులనే కాకుండా.. ఈ తరం అభిమానులని సైతం ఆకట్టుకుంది. ఇక ఈమె జీవిత కథను ” మహానటి ” అనే సినిమాతో ఆసక్తికరంగా తెరకెక్కించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఒక పల్లెటూరి అమ్మాయి సినిమాలలో చేసేందుకు చెన్నైకి వెళ్లడం.. ఛాన్స్ కొట్టేయడం.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్ర నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం.. తెరపై మహానటిగా పేరు పొందడం ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు.
ఇక అలాగే ఈమె రియల్ లైఫ్ లో జెమినీ గణేష్ తో ప్రేమలో పడడం… అనంతరం ఆయన సావిత్రిని మోసం చేయడం.. లాంటివి చూసి ప్రేక్షకులు కంటతడి పెట్టుకున్నారు. ఇలా తన అందమైన జీవితాన్ని అంధకారంగా మార్చుకున్న ఈమెని చూసి ప్రేక్షకులు ఎంతగానో బాధపడ్డారు. ఇక ఇలా ఈమె జీవితాన్ని పలు సినిమాలలో చూపించారు. అయితే ఇవే కాకుండా సావిత్రి కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సాధారణంగా ఎవరైనా తమ ఇంట్లో కుక్కలు, పిల్లులను పెంచుకోవడం కామన్. కానీ సావిత్రి మాత్రం చిరుత పులిని పెంచుకుంది. ఆమె తన ఇంట్లోనే చిరుతతో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా 1950 లలో సినీ జీవితాన్ని ప్రారంభించిన ఈమె.. దాదాపు 30 ఏళ్లకు పైగా వెండి తెరను ఏలడం ఆశ్చర్యం. ఇక ప్రస్తుతం సావిత్రి, చిరుత కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.