మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తనయుడు రామ్చరణ్ మాత్రం తండ్రి సినీ బ్యాగ్రౌండ్ తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. నటనల్లో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్న రామ్చరణ్.. గ్లోబల్ స్టార్ గా కూడా మారి.. పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మగధీరతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకొని వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ను దక్కించుకొని ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారాడు.
ఇక అసలు విషయానికి వస్తే చిరంజీవి 16 ఏళ్ల క్రితం వజ్రోత్సవ వేడుకల్లో స్టేజ్ పై మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. గోవా ఫిలిం ఫెస్టివల్ లో ఏ ఒక్క తెలుగు నటుడు ఫోటో కూడా రావడం లేదని ఇది చాలా బాధాకరమైన విషయం అంటూ చెప్పుకొచ్చాడు. మన తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ లాంటి ఎంతోమంది కళాతపస్వులు ఉన్నారని.. అయితే వీళ్ళు ఎవరి ఫోటోలు కూడా ఇప్పటివరకు గోవా ఫిలిం ఫెస్టివల్లో కనిపించడం లేదని.. మన టాలీవుడ్ ఇండస్ట్రీకి గోవా ఫిలిం ఫెస్టివల్ లో గౌరవం ఉండడం లేదంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు.
అయితే చిరంజీవి 16 ఏళ్ల కిందట అన్న మాటల్ని ఇప్పుడు రామ్ చరణ్ తిప్పికొట్టాడు. ఇటీవల జరిగిన గోవా ఫిలిం ఫెస్టివల్ లో రామ్ చరణ్ ఫోటో కనిపించింది. దీంతో ఏ విషయంలో అయితే చిరంజీవి గారు బాధపడ్డారు.. ఆ విషయంలోనే రామ్ చరణ్ గెలిచి చూపించారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తండ్రి కలను కొడుకు నెరవేర్చాడు అంటూ అభిమానులు కామెంట్లతో ప్రశంసాల వర్షం కురిపిస్తున్నారు. ఆశ్చర్యంగా చిరంజీవి కలగన్న దానిని రామ్ చరణ్ భలే చేసి చూపించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.