రాశి ఖన్నా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ బ్యూటీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా క్రేజ్ను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ కమర్షియల్, థాంక్యూ సినిమాల తర్వాత టాలీవుడ్లో కనిపించలేదు. గత ఏడాది నుంచి తెలుగు సినిమా అవకాశాల కోసం తెగ ప్రయత్నిస్తున్న రాశి ఖన్నాకు అవకాశాలు తగ్గడం లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పూజా హెగ్డే తప్పుకున్న తర్వాత రాశి ఖన్నా హీరోయిన్గా నటించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఆడిషన్స్ లో కూడా పాల్గొన్న రాశి ఖన్నాకు అవకాశం ఇవ్వలేదు.
శంకర్ డైరెక్షన్ లో ఈ సినిమా తర్కెక్కుతుంది ఈ సినిమాలో శ్రీ లీల అవకాశాన్ని కొట్టేసింది. ఇలా ఎప్పటికప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా ఈ బ్యూటీ ఎట్టకేలకు సినిమా అవకాశం సాధించడంలో సక్సెస్ అయ్యింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న మూవీలో హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. స్టైలిస్ట్ నీరజ కోస దర్శకురాలుగా మారిన సంగతి తెలిసిందే. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున ఈ సినిమాలో హీరోయిన్గా రాశిని తీసుకున్నారట.
నీరజా, రాశి ఖన్నా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఎప్పుడూ ఉంటుంది. ఈ వార్నింగ్ తోనే రాశి ఖన్నాకు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇక్కడ ఓ మెలిక ఉంది. సినిమాలో మెయిన్ హీరోయిన్ రాశి ఖన్నా కాదు. కే జి ఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తుంది. రాశి ఖన్నాను సెకండ్ హీరోయిన్గా చూపించబోతున్నట్లు సమాచారం. ఏదేమైనా ఎట్టకేలకు రాశి ఖన్నాకు కూడా సినిమాలో అవకాశం వచ్చింది. దీంతో రాశి ఖన్నా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా ఈ సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకుని మరిన్ని అవకాశాలు రాశి ఖన్నా సంపాదిస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.