బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమా రిలీజ్కు మరో 20 రోజులు సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గణేష్ యాన్తమ్ సాంగ్ ప్రేక్షకుల అంచనాలను మించి మెప్పించడంతో పాటు సెకండ్ సింగిల్ పార్ట్ అంచనాలను పెంచింది. తాజాగా ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియో విడుదలైంది.
అనిల్ రావిపూడి మేకింగ్ వీడియోతో అంచనాలను రెట్టింపు చేశాడు. ” కలిసి మాట్లాడతా అన్నాగదా ” అంతలోనే మందిని పంపాలా ” అంటూ మేకింగ్ వీడియోలో బాలయ్య చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. బాలయ్య డైలాగ్స్తోనె ప్రేక్షకులను ఫిదా చేస్తాడు. ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. బ్రో.. ఐ డోంట్ కేర్ అంటూ టీజర్ ను ముగించిన విధానం సైతం ఆకట్టుకుంది.
బాలయ్యకు విలన్ గా నేషనల్ అవార్డు విన్నర్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. కాజల్, శ్రీ లీలకు మేకింగ్ వీడియోలో ప్రాధాన్యత దక్కకపోయినా సినిమాలో వీళ్ళిద్దరి పాత్రలకు ప్రాధాన్యత ఉండనుందని సమాచారం. తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన.. డైలాగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. బాలయ్య సినిమాతో బాక్సాఫీస్ ను మరోసారి షేక్ చేయడం ఖాయమని ప్రేక్షకులు నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2024 దసరా పండగ ఫ్యాన్స్ కు విందు భోజనంలా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
View this post on Instagram