ఆ డ్రగ్ మత్తులో పల్లవి ప్రశాంత్..యావర్ ఎదవ.. షకీలా సెన్సేషనల్ కామెంట్స్..!!

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 7 షోలో ప్రముఖ నటి షకీలా రెండో వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఫైర్ బ్రాండ్ షకీలా అంటే మంచి కంటెంట్ ఉంటుందని అంచనాలు పెంచుకున్న ప్రేక్షకులను నిరాశ పరిచింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన షకీలా… నేరుగా బిగ్ బాస్ బజ్‌లోకి వెళ్లి గీతు రాయల్ తో ముచ్చటించింది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్‌పై షకీలా సంచలన వ్యాఖ్యలు చేసింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కంటిస్టెంట్ల గురించి షకీలా మాట్లాడుతూ… ” చిన్న సమస్య ఎదురైతే అమర్ దీప్ తట్టుకోలేకపోతున్నాడు. యావర్ పెద్ద ఎదవ.. బాడీ పెంచితే.. ఏదైనా సాధించవచ్చు అనే భ్రమలో ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ బ్లడీ రాంగ్ యాటిట్యూడ్. ఇంట్లోకి వచ్చిన రోజు చెప్పులు బయట విడిచి వచ్చాడు. రెండో రోజు ఇంటి ముందు పెట్టాడు. మూడో రోజు ఇంట్లోకి చెప్పులు వేసుకుని వచ్చాడు. నాలుగో రోజు చెప్పులు కాళ్లకు వేసుకుని కాలి పై కాలు వేసుకొని ఆడించాడు.

పాపులారిటీ అని డ్రగ్ మత్తులో ప్రశాంత్ ఉన్నాడు అని సంచలన కామెంట్స్ చేసింది షకీలా. ఇక ఆట సందీప్.. ఇంట్లో ఉండాల్సిన హుందాతో ఉన్న వ్యక్తి అంటూ ప్రశంసించింది. ఇక శివాజీ సొంత బ్రదర్ కంటే ఎక్కువ అని ప్రేమ కురిపించింది. అలాగే రతిక అందమైన విష సర్పం. ఎవరి కళ్లలోకి చూడదు. ఇతరులకు దొరికిపోతుందని భయం ఆమెకు ఉంది ” అంటూ వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా తాను చనిపోతే బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరురావాలని నాకు అదే కావాలని చెప్తూ ఎమోషనల్ అయింది.