స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. “ఏం మాయ చేసావే” సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత.. స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ఈ మధ్య కాలంలో మయోసైటిస్ బారిన పడి కొన్ని రోజులు సినిమాలకు దూరమైంది. ఇక ఆ తరువాత మళ్లీ కోల్కొని ఖుషి సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈమె అమెరికాకి వెళ్ళింది. మయోసైటిస్ చికిత్స కోసం సమంతా కొన్ని నెలల పాటు అమెరికాలో ఉండనుంది.
తాజాగా ” ఖుషి ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ మంచి విజయాన్ని అందుకుంది. నటన, అందంతో అలరించింది. ముఖ్యంగా విజయ్ తో రొమాన్స్ అదరగొట్టేసింది. ఈ మూవీ సక్సెస్ కావడానికి వారిద్దరి మధ్య చూపించిన రొమాన్స్ అనే చెప్పాలి.
ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత మాట్లాడుతూ…” నేను సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా అడుగు పెట్టకముందు నుంచి పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని.. ఆయనతో కలిసి ‘ అత్తారింటికి దారేది ‘ సినిమాలో నటించే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. నాకు పవన్ తో ఎన్నిసార్లు నటించే అవకాశాలు వచ్చిన అసలు మిస్ చేసుకోను ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సామ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.