ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లి పేరు మారుమోగిపోతుంది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కు ఇటీవల జవాన్ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. త్వరలోనే వెయ్యకోట్ల కలెక్షన్ మార్క్ కొల్లగొట్టి రికార్డును సొంతం చేసుకోబోతుంది జవాన్. ఇక రాజారాణి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అట్లి తేరి, బిజిల్ , మెర్సల్ లాంటి సూపర్ హిట్ సినిమాలుకు డైరెక్టర్గా వ్యవహరించాడు.
ఆయన దర్శకత్వం వహించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ కావడంతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అట్లి షారుక్ ఖాన్ తో సినిమా తీసే అవకాశాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో తన సత్తా చాటాడు. అయితే అట్లీ పర్సనల్ విషయాలకి వస్తే అతడి భార్య కృష్ణకుమారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈమె తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించిన సంగతి చాలా మందికి తెలియదు. అలాగే పలు సినిమాల్లో హీరో చెల్లి పాత్రలో కూడా నటించింది.
అలా గతంలో నందమూరి తారకరత్న హీరోగా నటించిన యువరత్న సినిమాలో తారకరత్నకు చెల్లెలిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా అప్పట్లో ఫ్లాప్ అయినా ఈమెకు మాత్రం ఆ పాత్రలో మంచి పేరు వచ్చింది. అయితే తారకరత్నకు కుమారి అప్పట్లో మంచి స్నేహితురాలట. తారక్ బ్రతికి ఉన్నప్పుడు వారిద్దరు చాలా బాగా మాట్లాడుకునే వారని.. కృష్ణకుమారి తారక్ మరణ వార్త విని చాలా బాధపడిందని.. సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. అయితే వీరిద్దరు కలిసి నటించిన సమయంలో ఆమెకు మరిన్ని అవకాశాలు రావడానికి తారకరత్న కూడా ఎంతగానో ప్రోత్సహించేవాడట.