పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ” సలార్ ” సెప్టెంబర్ 28న ప్రేక్షకులు ముందుకు గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజై ప్రేక్షకుల అంచనాలను మరింతగా పెంచింది. ఇన ప్రస్తుతం సలార్ కి బారి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఒక్క ఉత్తరాంధ్రకు అవుట్ రేట్ కింద రూ.20 కోట్ల బిజినెస్ చేయబోతున్నారట.
ఒకవేళ సంక్రాంతి ఈ సినిమా వస్తే మాత్రం ఈ రేటుకు తీసుకోవడానికి బయ్యర్లు ముందుకు రావచ్చు. ఇక సలార్లో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు శృతిహాసన్ తన రోల్కి డబ్బింగ్ ఇస్తుంది. 5 భాషల్లో ఈ సినిమా డబ్బింగ్ తానే చెప్పుకోవడానికి రెడీ అయింది. ఈ సినిమా 3 భాషల డబ్బింగ్ పనులు కంప్లీట్ అయ్యాయని.. మరో 2 భాషల డబ్బింగ్ పనులలో బిజీగా ఉన్నానని శృతిహాసన్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
అన్నట్లు ఈ సినిమాకు శృతిహాసన్.. ఆధ్య అనే పాత్రలో నటించింది. ఇక హాలీవుడ్ స్టైల్లో ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ రూపొందిస్తున్నారు. ప్రభాస్ కెరీర్లోనే సరికొత్త మాస్లుక్లో ఈ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ రేంజ్ లో ప్రభాస్ లుక్ని డిజైన్ చేశాడట. ఇక ఈ సినిమా రిలీజై ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో..? లేదో..? చేడాలి.