క్రికెట్ ల‌వ‌ర్స్‌కు గుడ్‌న్యూస్‌.. వ‌ర‌ల్డ్‌క‌ప్ టిక్కెట్ల బుకింగ్ ఎప్ప‌టి నుంచి అంటే..!

భారత్ వేదికగా జరుగునున్న వన్డే ప్రపంచకప్ 2023కు రంగం సిద్ధమైంది. ప్రధాన పోరులు ముందు సన్నాహకంగా జరిగే వార్మింగ్ మ్యాచ్ల షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. టోర్మీలో పాల్గొంటున్న 10 జట్లూ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 మధ్య రెండేసి మ్యాచ్లో చొప్పున ఆడుతాయి. ఈ మ్యాచులు హైదరాబాద్, తిరువనంతపురం, గువహటి నగరాల్లో జరగనున్నాయి. భారత్ తమ తొలి వామప్‌ మ్యాచ్‌లో సెప్టెంబర్ 30న డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తో గువహతి వేదికగా తలపడనున్నాయి.

ఇక వరల్డ్ కప్ కోసం ” బుక్ మై షో” ను తమ టికెటింగ్ భాగస్వామిగా బిసీసీఐ ప్రకటించింది. ప్రధాన మ్యాచ్ లు వామప్‌మ్యాచ్ లు కలిపి మొత్తం 58 మ్యాచ్ల టికెట్లను బుక్ మై షో ద్వారా కొనుగోలు చేయవచ్చు. భారత్ మినహా ఇతర జట్ల వామప్ మ్యాచ్‌లు, ప్రధాన మ్యాచ్‌ల‌కు సంబంధించిన టికెట్లు ఈనెల 25 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అయితే బోర్డ్ స్పాన్సర్లలో ఒకరైన “మాస్టర్ కార్డ్” వినియోగదారులకు మాత్రం ఒకరోజు ముందుగానే టికెట్లు లభిస్తాయి. భారత్ ఆడే వామప్ మ్యాచ్‌ల‌కు ఈనెల 30 నుంచి టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

ఇదే విధంగా టీమిండియా ఆడే ప్రధాన టోర్నీ మ్యాచ్లకు నాలుగు ధపాలుగా టికెట్లు విడుదల చేయనున్నారు. చెన్నై, ఢిల్లీ, పూణేలో భారత్ ఆడే మ్యాచ్లకు ఆగస్టు 31 నుంచి…ధర్మశాల, లక్నో, ముంబైలో ఆడే మ్యాచ్ లకు సెప్టెంబర్ 1 నుంచి టికెట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. అదేవిధంగా బెంగళూర్, కోల్కతాలో ఆడే మ్యాచ్ లకు సెప్టెంబర్ 2 నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరోవైపు సెమీఫైనల్,ఫైనల్కు సెప్టెంబర్ 15 నా బీసీసీఐ విడుదల చేయనుంది.