మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం సినిమాలను నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో పాన్ ఇండియా లెవెల్లో మరో సినిమాను రూపొందించబోతున్నాడు. ఇక మహేష్ బాబు సెలవులు దొరికినప్పుడల్లా.. తన ఫ్యామిలీతో పిల్లలతో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అన్న సంగతి తెలిసిన విషయమే. ఇటీవల మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఫారన్లో ఎంజాయ్ చేసిన వెకేషన్ ట్రిప్ పై అనేక చర్చలు జరుగుతున్నాయి.
ఇక ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో మహేష్ బాబును ఇంటర్వ్యూ వెర్స్ దీనిపై ప్రశ్నించగా మహేష్ బాబు కొన్ని ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. నా వెకేషన్స్ గురించి జరుగుతున్న చర్చలు నా దృష్టికి కూడా వచ్చాయని.. మహేష్ బాబు అన్నారు. నా సోషల్ మీడియా పోస్టుల ద్వారానే మా వెకేషన్ గురించి జనాలకి తెలుస్తుందని మహేష్ బాబు సరదాగా మాట్లాడాడు. షూటింగ్ కి గ్యాప్ వచ్చినప్పుడు లేదా నా పిల్లలకు సెలవులు వచ్చినప్పుడు నేను వెకేషన్ లోకి వెళ్తానని వారితో ఎంజాయ్ చేస్తానని మహేష్ అన్నారు.
నా వెకేషన్ పిక్స్ నీకు నచ్చాయా లేక అసూయ పడుతున్నావా అంటూ మహేష్ బాబు ఇంటర్వ్యూ వర్తో ఫన్నీ కాన్వర్జేషన్ జరిపాడు. మీరు వెకేషన్స్ కి వెళ్లడం కొంతమందికి పర్వాలేదని రిపోర్టర్ అనడంతో.. మహేష్ వెంటనే.. నా వెకేషన్ తో ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి అని అన్నాడు. పిల్లలతో వాల్యుబుల్ టైమ్ని స్పెండ్ చేయడానికి నేను ఇష్టపడతాను అంటూ సూపర్ స్టార్ చెప్పిన ఆ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.