ఆ సినిమా కోసం రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనికేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..!

సౌత్ ఇండియాన్‌ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. వయసు మల్లుతున్న ఏమాత్రం లెక్కచేయకుండా ఏజ్ జస్ట్ నెంబర్ అనుకుంటూ సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా రజిని నటించిన జైలర్ సినిమా నిన్న‌ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. రజినీకి ఈ సినిమా హిట్ చాలా అవసరం. ఎందుకంటే… గత కొద్ది సంవత్సరాలుగా సినిమాలు అయితే చేస్తున్నాడు. కానీ సక్సెస్ సాధించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోని జైలర్ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇది పక్కన పెడితే ఓ సినిమా కోసం రజినీ కంటే హీరోయిన్ కే పారితోషకం ఎక్కువ ఇచ్చారట.

ఇంతకీ ఆమె ఎవరు? ఏ మూవీలో నటించింది. సాధారణంగా ఏ సినిమా చూసుకున్న దాదాపు హీరోయిన్ కంటే హీరోకే రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. రజినీ లాంటి వాళ్లకైతే దాదాపు రూ.100 కోట్లకు పైగానే ఉంటుంది. కెరీర్ ప్రారంభంలో కె. బాలచందర్ దర్శకత్వంలో మూండ్రు ముడిచ్చు అనే సినిమా చేశారు. అంతకుముందు తెలుగులో వచ్చిన ఓ సీత మూవీకి ఇది రీమేక్. ఈ సినిమాలో నటించినందుకు రజనీకాంత్ కి కేవలం రూ.2000 మాత్రమే ఇచ్చారట.

ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీదేవికి మాత్రం రూ. 5000 ఇచ్చారట. ప్రధాన పాత్రలో నటించిన కమల్ హాసన్ కి మాత్రం రూ.30,000 మాత్రమే ఇచ్చారట. అప్పటికే కమల్ హాసన్ కి ఫాలోయింగ్ ఉండడంతో ఎంత మొత్తం ఇచ్చారని గతంలో శ్రీదేవి ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. మొత్తానికి ఏదేమైనా రజినీకాంత్ కంటే శ్రీదేవికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారంటే ఇది ఆశ్చర్య పోవాల్సిన విషయమే. ఏదేమైనా వీరిద్దరూ కలిసి దాదాపు 18 సినిమాలు నటించడం విశేషం.