టాలీవుడ్ నిర్మాత రాజకీయ నాయకుడు సూపర్ స్టార్ కృష్ణ బ్రదర్ ఆదిశేషగిరిరావు అందరికీ సుపరిచితమే. కృష్ణ సంబంధించి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను నిర్మించిన ఈయన తాజాగా మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని కృష్ణ జయంతి సందర్భంగా ఈనెల 31 వ తేదీన రి రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేశారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఆదిశేషగిరిరావు. ఈ సందర్భంగా పలు మీడియా ఛానల్స్ తో మాట్లాడిన ఈయన పలు రకాల విషయాలను సైతం తెలియజేశారు. తాజాగా కృష్ణ విజయనిర్మల దంపతుల కుమారుడు వికె నరేష్ పైన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.
కృష్ణ గారు మరణించాక పార్థివ దేహాన్ని నానక్ రామ్ గూడలో ఒంటరిగా వదిలేశారని.. అక్కడ నరేష్ లేరని ఆయన మూడో భార్య రమ్య రఘుపతి ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో ఎవరు లేకపోవడం చూసి అభిమానుల సైతం చాలా బాధపడ్డారని వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై ఆదిశేషగిరిరావు స్పందిస్తూ.. నరేష్ ఎవరు అంటూ వాక్యానించారు కృష్ణ పార్థివ దేహం వద్ద మా అబ్బాయి ఉన్నాడు మా మేనల్లుడు ఉన్నాడు ఆరోజుకు మహేష్ రాలేక పోతే ఎవరూ లేనట్టేనా ?.. నరేష్ వాళ్ల గొడవలు గురించి నేను అసలు మాట్లాడను మీరు చెప్పే ఆ వీడియోను నేను ఇంతవరకు చూడలేదు అంటూ ఆదిశేషగిరిరావు తెలిపారు.
రమేష్ బాబు, ఇందిరా, కృష్ణ ఒకే ఏడాదిలో మరణించడంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయామని తెలిపారు. ఇప్పుడిప్పుడే ఆ విషయం నుంచి బయటపడుతున్నామని తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణ అసలు చలించాడు ఎంత కష్టంలో ఉన్నా సరే దాచుకుంటాడు ముఖంలో ఏది చూపించాడు జయ అపజయాలను అతను ఏనాడు పట్టించుకోలేదు సినీ ప్రవరి శ్రమలో అన్ని చూశారని తెలిపారు.