బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాతో మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ మరోసారి తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరోసారి ఎందుకు అంటున్నామంటే ఈమె ముందుగా 2008లోనే శివాజీ హీరోగా వచ్చిన ఆలయం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ వచ్చింది. ఆ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేక పోవడంతో హనీ రోజ్కు తెలుగులో అవకాశాలు రాలేదు.
టాలీవుడ్లో ఆలయం సినిమా మెప్పించలేకపోయినా మలయాళంలో మాత్రం ఈ అమ్ముడు వరుస సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఈమె ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది. హనీ ఇప్పుడు టాలీవుడ్ లో వీర సింహారెడ్డిలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ సినిమాలో హనీ రోజ్ బాలకృష్ణ తల్లిగా మరోవైపు భార్యగా నటించి రెండు పాత్రలోనూ ఎంతో వైవిధ్యం చూపించింది. ఇక దీంతో ఈ అమ్మడు మరోసారి టాలీవుడ్ లో తన క్రేజ్ పెంచుకుంది. ఈ సినిమా తర్వాత హనీ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ సినీ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈమె ఇప్పటికే మూడు సినిమాలకు పైగా కమిట్ అయినట్టు టాలీవుడ్ వర్గాల నుంచి టాక్ వినబడుతుంది. ఇప్పుడు దింతో హనీ రోజ్ మరోసారి టాలీవుడ్ లో తెగ వైరల్ గా మారింది.