తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక సమయంలో యూత్ ఫుల్ హీరోగా పేరు సంపాదించిన ఉదయ్ కిరణ్ ఎంతోమంది అభిమానులను సంపాదించారు. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలలో చిత్రం ,నువ్వు నేను మనసంతా నువ్వే తదితర సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా పేరుపొందారు. అతి తక్కువ కాలంలోనే ఉదయ్ కిరణ్ ఎంతో గుర్తింపు సంపాదించారు. కొన్నాళ్లపాటు సినీ పరిశ్రమకు దూరమైన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత విషిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ కొన్ని కారణాల చేత ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడం ఒకసారిగా తెలుగు ప్రేక్షకులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు అయితే ఇప్పటికి ఉదయ్ కిరణ్ మరణం మీద పలు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
అయితే ఇప్పుడు తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పలు విషయాలను బయటపెట్టారు డైరెక్టర్ తేజ. ఉదయ్ కిరణ్ జీవితంలో ఏం జరిగింది అనే విషయం తనకు తెలుసని చనిపోవడానికి కొన్ని రోజుల ముందు ఉదయ్ కిరణ్ తనకు ఒక విషయాన్ని తెలిపారని చెప్పుకొచ్చారు తేజ. వాస్తవానికి ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయారో అనే విషయం మీద సరైన క్లారిటీ ఎవరికీ లేదు. ఆయన ఒకప్పుడు స్టార్ హీరోగా ఎన్నో సినిమాలలో చేసి ఆ తర్వాత పూర్తిగా అసలు సినిమాలకు దూరం అయిపోవడంతో సెలబ్రిటీ హోదాని మిస్ అయ్యి ఆ డిప్రెషన్ లోకి వెళ్లిపోయి సూసైడ్ చేసుకున్నట్లుగా ఒక ప్రచారం జరుగుతోందని తెలిపారు
అంతేకాకుండా భార్యతో ఉన్న సమస్యల వల్ల చనిపోయినట్లుగా మరికొంతమంది తెలిపారు. తేజకు అన్ని విషయాలు తెలుసట.. కానీ బయట పెట్టనని చెప్పేశారు. కానీ ఉదయ్ కిరణ్ ఎలాంటి తప్పు చేయలేదని..ఆ తప్పు చేస్తే ధైర్యం కూడా తనకు లేదని తెలియజేశారు. ఇక తాను చనిపోయేలోపు ఏదో ఒక సమయంలో ఈ విషయాన్ని బయట పెడతానని తెలిపారు తేజ.