తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీరిద్దరూ పెద్దగా బయట కనిపించరు. కానీ కొన్ని అకేషన్స్ కి మాత్రం కచ్చితంగా హాజరవుతూ అక్కడ హైలెట్ గా నిలుస్తూ ఉంటారు. 2011 మే 5వ తేదీన లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్నారు ఎన్టీఆర్. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయంగా కూడా బాగా పేరు సంపాదించారు ఎన్టీఆర్. దీంతో ఎన్టీఆర్ పెళ్లికి ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా హాజరు కావడం జరిగింది. అప్పుడప్పుడు తమ కుటుంబాలతో తమ సమయాన్ని గడిపేందుకు విదేశాలకు సైతం వెళుతూ ఉంటారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ – ప్రణితల వివాహం చాలా ఘనంగా జరిగింది. హైదరాబాదులో అప్పట్లో వీరి వివాహానికి ఆయన ఖర్చు వేసిన మండపం ఇండస్ట్రీలో చాలా హాట్ టాపిక్ గా మారింది. 160 మీటర్ల ఎతైన కళ్యాణ మండపాన్ని అప్పట్లోనే ఏర్పాటు చేశారట. దీని ధర దాదాపుగా రూ. 20 కోట్ల రూపాయల వరకు ఖర్చయినట్లు సమాచారం. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ ఈ కళ్యాణ మండపానికి సంబంధించిన పనులు చూసినట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ – ప్రణితల వివాహానికి మొత్తం అక్కడికి 10 వేల మంది పైగా హాజరైనట్లు సమాచారం.
ఇక టాలీవుడ్ సింగర్ గీతామాధురి, కృష్ణ చైతన్య ఎన్టీఆర్ – ప్రణితల వివాహానికి కొన్ని స్పెషల్ సాంగ్ లతో కూడా అలరించారు. అతిధుల కోసం ఖరీదైన హోటల్స్ కూడా బుక్ చేశారు. ఇక ఎన్టీఆర్ పెళ్లి పత్రిక విషయానికి వస్తే.. చాలా సింపుల్ గా సాంప్రదాయంగా ఉందని చెప్పవచ్చు. ఇక వీరి పెళ్లి పత్రికకు తమ తాత గారి పెళ్లి పత్రికలను జత చేశారు. ఇక వీరిద్దరిని ఎంతోమంది ప్రముఖులు రాజకీయ నాయకులు సైతం వచ్చి ఆశీర్వదించారు . ప్రస్తుతం వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.