తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు బాలకృష్ణ గురించి సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే సోషల్ యాక్టివి విజయ్ గోపాల్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి దగ్గరలో ఉన్న సర్కారు స్థలాన్ని బాలక్రిష్ణ అక్రమంగా ఆక్రమిస్తున్నారని విషయాన్ని తెలియజేశారు. ఈ విషయాన్ని GHMC సిబ్బంది కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఇంతకీ ఈ ఆరోపణ చేసిన విజయ్ గోపాల్ ఎవరు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
జూబ్లీహిల్స్ లోని ప్రధాన రోడ్డు దగ్గర నందమూరి బాలకృష్ణ నివాసం ఉన్నది. ప్రధాన రహదారికి ఆనుకొని ఉండే ఈయన నివాసం నిత్యం ఎప్పుడు వాహనాలతో హడావిడిగా ఉంటుందట. పదేళ్ల క్రితం ఈ ప్రాంతంలో పెద్దగా ట్రాఫిక్ లేనప్పటికీ ఇటీవల కాలంలో బాగా పరిస్థితి మారిపోయి ట్రాఫిక్ పెరిగిపోయింది. ప్రభుత్వానికి చెందిన పేవ్ మెంట్ ను బాలయ్య ఆక్రమించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక విజయ్ గోపాల్ విషయానికి వస్తే గతంలో కూడా బుక్ మై షో పేటీఎం వంటి సమస్యలు చేసే తప్పులను కూడా చూపిస్తూ న్యాయపోరాటం చేస్తూ ఉండేవారు.
తనకు జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా రాబట్టిన ఆయన తాజాగా బాలకృష్ణ ఇంటి దగ్గర సర్కారు స్థలాన్ని దర్జాగా ఆక్రమించుకుంటున్నట్లుగా తెలియజేశారు. అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని GHMC మున్సిపల్ కార్పొరేషన్ కు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ లాంటి వారికి కూడా ట్యాగ్ చేయడం జరిగింది. సాధారణ ప్రజలు కూడా సెలబ్రెటీలు అయితే వారు ఏం చేసినా మీరు ఇలాగే సైలెంట్ గా ఉంటారా అంటూ తన ట్రీట్ నుంచి ప్రశ్నించిన ఒక ట్రీట్ వైరల్ గా మారుతోంది.
Yesterday I couldn't help but realise how this @NBK house has clearly encroached the pavement completely infront of his house, putting generator, greenery n all, while people walking on roads. Right after the house, the pavement is fine. Why ?! @GHMCOnline @ZC_Khairatabad (1/2) pic.twitter.com/0SxxSWec6c
— Vijay Gopal (@VijayGopal_) October 8, 2022