టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా సిద్ధార్థ్ పేరు వినపడడానికి కారణం సమంతా అని చెప్పవచ్చు. ఆయన గతంలో సమంతతో ప్రేమాయణం నడిపారు. కానీ ఆ తర్వాత సిద్దార్థ్ వ్యక్తిత్వం నచ్చక సమంతా అతడికి బ్రేకప్ చెప్పింది. అంతేకాదు వీరిద్దరూ వివాహం చేసుకోవడానికి ఏవో అడ్డంకులు ఏర్పడడంతో కాణిపాకంలో వీరిద్దరూ ప్రత్యేక గ్రహ దోష పూజలు కూడా నిర్వహించారు. కానీ ఫలితం లేక ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో ఎట్టకేలకు విడిపోయారు. కానీ సిద్దార్థ్ కేవలం సమంతతో మాత్రమే ఎఫైర్ నడిపాడు అని అందరూ అనుకుంటారు. కానీ ఈయన మోసం చేసిన అమ్మాయిల లిస్ట్ చూస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. ఈ అమ్మాయిల మోజులో పడి కట్టుకున్న భార్యను కూడా దూరం చేసుకున్నాడు సిద్ధార్థ్. ఇకపోతే ఇప్పటివరకు సిద్ధార్థ్ వలలో పడి మోసపోయిన అమ్మాయిలు గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..
సోహా అలీ ఖాన్:బాలీవుడ్ సినిమా రంగ్ దే బసంతి సినిమాలో వీరిద్దరూ జంటగా కలిసి నటించారు. ఇక అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్న సిద్ధార్థ మొదటి భార్య ఛీ కొట్టి అతనితో విడాకులు తీసుకుంది. ఇక కొన్ని సంవత్సరాలు పాటు ముంబై లో సోహ అలీ ఖాన్ ఇంట్లోనే సహజీవనం చేసిన సిద్దార్థ్ చివరికి ఆమెతో గొడవపడి బ్రేకప్ చెప్పేశాడు.
దీపా సన్నిధి:సిద్దార్థ్ ఈమెతో కూడా లవ్ ఎఫైర్ పెట్టుకున్నాడు అని గతంలో తమిళ్ మీడియా కోడై కోసింది. కానీ ఈ వార్తలపై స్పందించిన దీపా సన్నిధి అతడితో ఎలాంటి సంబంధం లేదు అని, ప్రస్తుతం అతను టచ్ లో కూడా లేడు అని తెలిపింది.
శృతిహాసన్:ఇక అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి తన కెరీర్ ను మొదలు పెట్టడానికి అడుగుపెట్టిన శృతిహాసన్.. సిద్దార్థ్ మాయలో పడి అతనితో సహాజీవనం చేసింది .కానీ 2011లో ఇద్దరు విడిపోయారు.
అతిథి రావు హైదరి:సిద్ధార్థ్ చాలాకాలం గ్యాప్ తీసుకొని మహాసముద్రం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇందులో ఇతడికి జోడిగా అతిథి రావు హైదరి నటించింది. ఇకపోతే ఇటీవల వీరిద్దరు కూడా ముంబైలో ఒకే హోటల్ రూమ్ నుంచి బయటకు రావడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అక్కడ మీడియా వారిపై ఫోటోలు తీయద్దని.. తాను ఇక్కడి వాడిని కాదు అని.. ఫోటోలు బయటకు వస్తే బాగుండదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇంతమందితో లవ్ బ్రేకప్ చెప్పుకున్న ఇతను కనీసం అతిథితోనైనా తన ప్రేమను కొనసాగిస్తాడో లేదో తెలియాల్సి ఉంది.