వావ్: ముక్కుతో ఎన్టీఆర్‌-రాజమౌళి-చరణ్‌లను గీసిన ఆర్టిస్ట్‌..అభిమానులు ఫిదా..!!

దేశవ్యాప్తంగా #RRR ట్రెండ్ కొనసాగుతుంది. ఎక్కడ చూసిన ఎన్టీఆర్‌-రాజమౌళి-చరణ్‌ ల ఫోటోలు,ఫ్లెక్సీలే కనపడుతున్నాయి. గత కొంత కాలంగా అభిమానులతో పాటు బడా స్టార్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న సినిమా RRR. బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని తెరకెక్కించిన దర్శక ధీరుడు రాజమౌళి ..ఆ తరువాత తెరకెక్కించిన సినిమా RRR. ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ముందు నుండి సినిమా పై భారీ అంచనాలను పెట్టుకున్న అభిమానులను జక్కన్న ఏమాత్రం నిరాశపరచకుండా సినిమాని తెరకెక్కించాడు.

కాగా, ఈ సినిమా కి చేసిన అన్నీ ప్రమోషన్స్ రాజమౌళి మరే సినిమాకి కూడా చేయలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్ని దాదాపు నాలుగేళ్ళు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి..ఎన్నో అడ్డంకులను ఎదురుకుని..ఎట్టకేలకు సినిమాని రిలీజ్ చేశారు జక్కన్న. ఆయన కష్టం ఫలించింది. సినిమా సక్సెస్ అయ్యింది. మరి కొద్ది సేపట్లోనే అసలు రివ్యూ వచ్చేస్తుంది.

అయితే, ధియేటర్స్ వద్ద అభిమానులు కటౌట్లు, పాలాభిషేకాలు, బ్యానర్లతో దుమ్ము లేపుతున్నారు. కానీ ఓ వీరాభిమాని మాత్రం RRR టీంకు స్పెషల్ విషెస్ అందించారు. నిజాంపేటకు చెందిన సత్యవోలు రాంబాబు అనే ఆర్టిస్ట్‌ దర్శక ధీరుడు రాజమౌళి అంటే చాలా ఇష్టం..గౌరవం. ఆయన తెరకెక్కించే సినిమాలు ఖచ్చితంగా చూస్తారట. ఇక ప్రజెంట్ RRR సినిమాపై ఓ కళాఖండాన్ని రూపొందించి తన ప్రేమను చాటుకున్నాడు ఈ టాలెంటెడ్ సత్యవోలు రాంబాబు. చరణ్-తారక్-రాజమౌళి ముగ్గురు బొమ్మలను గీశాడు. అది కూడా ముక్కుతో .. యస్.. RRR టీంకు స్పెషల్ గిఫ్ట్ గా ఓ పెయింటింగ్‌ వేసి ఔరా అనిపించి అందరిని ఫిదా చేశాడు. కేవలం ముక్కుకు రంగులద్దుకుంటూ రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లను గీసి అందరినీ అబ్బురపరిచాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.