ఈ రోజు బెంగళూరులో జరిగిన IPL 2022 వేలంలో చాలా ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఈ రోజు కొందరు అంచనాలు ఉన్న ఆటగాళ్లు కూడా తక్కువ రేటుకే ప్రాంచైజీలు సొంతం చేసుకుంటే.. మరికొందరు ఆటగాళ్లు అనూహ్య అంచనాల మధ్య ఎక్కువ రేటుకు అమ్ముడుపోయారు. తొలి రోజు ప్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లుగా ఉన్న డేవిడ్ మిల్లర్, సురేష్ రైనా, స్టీవ్ స్మిత్లను పట్టించుకోకపోవడం విచిత్రమే. ఇక విండీస్ ఆటగాడు హిట్మెయిర్ జాక్పాట్ కొట్టేశాడు. హిట్మెయిర్ణు రాజస్తాన్ జట్టు రు. 8.50 కోట్లకు సొంతం చేసుకుంది.