టాలీవుడ్ లో ఒక ప్రముఖ నటుడు మరణించడం జరిగింది. హెచ్ బీవోలో ప్రసారమయ్యే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న”ది వైర్”సిరీస్ నటుడు మైకేల్ కె విలియమ్స్ న్యూయార్క్ సిటీలో తన నివాసంలో మరణించారు.కాబట్టి ఇక అతి చిన్న వయసులో ఎలా మరణించి ఉంటారు అన్నది అందరిలోనూ ప్రశ్నగా మారింది.
అక్కడున్న కొంతమంది తెలిపిన ప్రకారం మాదకద్రవ్యాలను అధికంగా సేవించడం వల్ల ఇతడు మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 2002లో ప్రముఖ ఛానల్ హెచ్ బీవోలో ది వైర్ అనే సిరీస్తో ప్రారంభించారు.దాదాపు ఆయన ఆరు సంవత్సరాల పాటు ఆ షోలోనే కొనసాగించారు.ఇక ఆ సినిమాలో కూడా ఇతను డ్రగ్ డీలర్ పాత్రలో చేసినట్లుచెబుతున్నారు.
.
అలా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన 2021 ఎమ్మి అవార్డుకు నామినేట్ అయ్యారు.లవ్ క్రాఫ్ట్ కంట్రీ సిరీస్ లో అతని నటనకు పురస్కారం లభించింది.అతను నటించిన కొన్ని షోలు అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.ఇతని మరణం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేసింది.ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ది వైర్ షో కోసం పని చేసిన పలువురు మంది మరణించడం గమనార్హం.