దేశంలో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు..మ‌ర‌ణాలు ఎన్నంటే?

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. భార‌త్‌లో కూడా క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి

గత 24 గంటల్లో భారత్‌లో 3,23,144 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,76,36,307 కు చేరుకుంది. అలాగే నిన్న 2771 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 1,97,894 కు పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 2,51,857 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 1,45,56,209 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 28,82,204 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, నిన్న ఒక్క‌రోజే దేశ‌వ్యాప్తంగా 16,58,700 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు.