మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉన్న కన్నప్ప రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా కు ప్రేక్షకుల నుంచి వస్తున్న మంచి రెస్పాన్స్ వస్తుందని సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది . అలాగే ఈ సినిమా కి వస్తున్న రెస్పాన్స్ తో చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ కూడా నిర్వహించారు . ఇక ఈవెంట్ లో హీరో విష్ణు తో పాటు మోహన్ బాబు , దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ వంటి వారు తదితరులు పాల్గొన్నారు .. అలాగే ఈ కార్యక్రమం లో ఓ విలేఖరి ఈ సినిమా కు బాలీవుడ్ దర్శకుని ఎందుకు తీసుకున్నారు అని ప్రశ్నించారు ..
ఈ ప్రశ్నకి విష్ణు సమాధానమిస్తూ .. టాలీవుడ్ లో కన్నప్ప లాంటి సబ్జెక్టును నాతో తెర్కక్కించేందుకు ఏ డైరెక్టర్ కూడా ముందుకు రారని . బాలీవుడ్ దర్శకుల కోసం చూశానని అందులో భాగం గానే మహాభారతం లాంటి ఎపిక్ సీరియల్ తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ ను ఈ సినిమా కోసం తీసుకున్నామని విష్ణు చెప్పుకొచ్చాడు .. అలాగే తాము ఊహించిన దాని కంటే ఆయన విజన్ ఎంతో గ్రాండ్ గా ఉందని ఈ సినిమా చూస్తుంటేనే అర్థమవుతుందని విష్ణు చెప్పుకొచ్చాడు ..
అలాగే ఈ సినిమా ను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా చెప్పుకొచ్చారు . ఇదిలా ఉంటే.. ట్రేడ్ నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తోలి రోజు రూ.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.కేవలం మన దేశంలోనే మొత్తం రూ.10 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు సమాచారం. మంచు విష్ణు కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా కూడా ఇదే అంటున్నారు. ఇక శనివారం, ఆదివారం ఈ రెండు రోజులు ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.