నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా మూవీ అఖండ 2. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. 2021 లో వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన యాక్షన్ ఎంటర్టైనర్ అఖండకు సీక్వల్గా ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాపై ఆడియన్స్లో మంచి హైప్ నెలకొంది. అభిమానులతో పాటు.. సినీ ఆడియన్స్ అంతా దీనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై.. రామ్ అచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు.. బాలయ్య కూతురు ఎం.తేజస్విని సమర్పకురాలుగా వ్యవహరిస్తుంది. ఇందులో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటిస్తుండగా.. మరో కీలక పాత్రల్లో ప్రగ్య జైశ్వాల్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే.. సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. ఈ సినిమాలో.. బాలయ్యతో కలిసి 32 ఏళ్ల క్రితం సిల్వర్ స్క్రీన్ షేర్ చేస్తున్న విజయశాంతి కూడా కీలకపాత్రలో కనిపించనుందట.
ఈ విషయంపై గతంలో వార్తలు తెగ వైరల్ గా మారినా.. మూవీ టీం మాత్రం స్పందించలేదు. కానీ.. తాజాగా ఈ విషయంపై మళ్ళీ జోరుగా ప్రచారం ప్రారంభమైంది. ఇక బాలకృష్ణ, విజయశాంతి జంటగా 1984లో కథానాయకుడు సినిమాలో మొదటిసారి నటించారు. తర్వాత నిప్పు రవ్వ మూవీలో జతకట్టారు. అలా దాదాపు 16 సినిమాల్లో కలిసి నటించిన ఈ క్రేజీ పేయిర్ దాదాపు 32 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారు అంటూ టాక్ వైరల్ అవ్వడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇక ఈ వార్తల్లో వాస్తవం ఏంతో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.