టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి మెగాస్టార్గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు చిరంజీవి. దాదాపు 157 సినిమాల్లో నటించిన చిరు.. ఎన్నో హిట్ సినిమాలతో సంచలనాలు సృష్టించాడు. ఈ క్రమంలోనే మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి దాదాపు అరడజనుకు పైగా హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయన.. ప్రస్తుతం మల్లిడి వశిష్ట డైరెక్షన్లో విశ్వంభర సినిమాతో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో మెగాస్టార్కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతుంది.
ఇంతకీ మేటర్ ఏంటంటే.. దాదాపు చిరు 47 ఏళ్ల సినీ కెరీర్లో ఆయన నటించిన అన్ని సినిమాల్లో ఒకే ఒక్క సినిమా మాత్రం షూటింగ్ పూర్తయిన రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆ మూవీ మరేదో కాదు శాంతి నివాసం. చిరంజీవి, మాధవి జంటగా నటించిన ఈ సినిమాకు బాబు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా నిర్మాత కారణంగా రిలీజ్ కాకుండా ఆగిపోయింది. రిలీజ్ కు రెడీ అవుతుండగా హఠాత్తుగా ప్రొడ్యూసర్ చనిపోవడంతో.. సినిమా రిలీజ్ ను ఆపేశారు.
తర్వాత అయినా ఈ సినిమా రిలీజ్ అవుతుందని అంతా భావించారు. కానీ.. దానిని బ్యాడ్ సెంటిమెంట్గా ఫీల్ అయ్యి శాంతినివాసం రిలీజ్ చేయడానికి ఎవరు సాహసం చేయలేదు. అలా చిరు కెరీర్లో షూట్ పూర్తై రిలీజ్ కాని ఏకైక సినిమాగా శాంతి నివాసం మిగిలిపోయింది. ఇక ఏడుపదుల వయసులోనూ ఇప్పటికీ మెగాస్టార్ తిరుగు లేని స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ తన ఫిజిక్, ఫిట్నెస్ తో ఆకట్టుకుంటున్నాడు చిరు. ఇక చిరు విశ్వంభర తర్వాత.. మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓద్దెలతో మరో ప్రాజెక్ట్ లైన్లో ఉంది.