నంద‌మూరి వార‌సుడు మోక్షజ్ఞ ఫ‌స్ట్ సినిమాయే కాదు.. కెరీరే గంద‌ర‌గోళం…!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడుగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మతో.. మోక్షజ్ఞ డబ్ల్యూ ఉండ‌నుంది. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ అందరిలో మొదట ప్రశాంత్ వర్మ పేరు వినిపిస్తుంది. తనది లక్కీ హ్యాండ్, సూపర్ హీరో కథతో పాన్‌ ఇండియా హిట్ కొట్టి.. అతి త‌క్కువ టైంలోనే స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకున్నాడు. కథతో మ్యాజిక్ చేయగల కెపాసిటీ ఉన్న ప్రశాంత్ వర్మ తో మోక్షజ్ఞ సినిమా తీస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంద‌ని నమ్మకంతో బాలయ్య.. మోక్షజ్ఞ డెబ్యూ బాధ్యతలు ప్రశాంత్ వర్మకు అప్పగించాడు. ఈ క్రమంలోని సరైన దర్శకుడి చేతిలో మోక్షజ్ఞ పెట్టారంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఫ్యాన్స్‌. అయితే కొన్ని అనివార్య కారణాలు వల్ల ప్రస్తుతం ప్రశాంత్ వర్మ కథ మోక్షజ్ఞ పక్కన పెట్టేసాడని ఓ షాకింగ్ న్యూస్ నెటింట‌ వైరల్ అవుతుంది.

Nandamuri Mokshagna - Prashanth Varma's Film Cancelled?

ప్రస్తుతం ఆదిత్య 999 పై మోక్షజ్ఞ తన ఫోకస్ పెట్టారట. ఇప్పటికే ఆదిత్య 369కు సీక్వెల్‌ను తర్కెక్కిస్తానని.. కచ్చితంగా దానికి దర్శకత్వం నేనే వహిస్తానంటే బాలయ్య చెప్పిన సంగతి తెలిసిందే. నిజానికి బాలయ్య డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ డెబ్యూ ఉంటుందని.. అది కూడా ఆదిత్య 369 సీక్వెలే అంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ.. ఎవరు అనుకోని రీతిలో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ డెబ్యూ అనౌన్స్ చేశారు. దీంతో ఆదిత్య 999 పక్కన పెట్టి ఉంటారు. ప్రశాంత్ వర్మతో సినిమా పూర్తి అయిన తర్వాత అది తెర‌కెక్కుతుందని అంత భావించారు. కానీ.. ఇప్పుడు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ మూవీ ఆగిపోయిందని.. ప్రశాంత్ వర్మ దానికి కార‌ణం అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ప్రశాంత్ ఇంకా పూర్తిస్థాయిలో కథను సిద్ధం చేసుకోలేద‌ని.. తన దగ్గర కేవలం ఒక లైన్ మాత్రమే ఉందని.. బౌండెట్ స్క్రిప్ట్ పూర్తికాలేదని సమాచారం.

Nandamuri Hero Locked Two Talented Directors Even Before Release? | Nandamuri  Hero Locked Two Talented Directors Even Before Release?

ఈ క్రమంలోనే నాపై నమ్మకం ఉంచండి.. నేను హిట్ ఇస్తా అని ప్రశాంత్ వర్మ బాలయ్య కు చెప్పినా.. బాలయ్య దానికి ఇష్టపడడం లేదని తెలుస్తుంది. మరో పక్క మోక్షజ్ఞ కూడా కన్ఫ్యూషన్ లో ఉన్నాడని తెలుస్తుంది. మొదటినుంచి నటనపై సినిమాలపై ఆసక్తి లేని మోక్షజ్ఞ.. తండ్రి కోసం సినిమాల్లోకి అడుగు పెట్టాలనుకున్నాడట. ఇప్పుడిప్పుడే సినిమాలపై ఫోకస్ చేస్తున్న మరో పక్కన మరికొంత టైం కావాలని అడిగాడ‌ట‌. నటనపై శిక్షణ తీసుకుంటున్న మోక్షజ్ఞ.. పూర్తి రేంజ్ లో సిద్ధం కాలేదని ఇన్సైడ్ వర్గాల సమాచారం. ఇక‌ ప్రశాంత్ వర్మ కూడా స్క్రిప్ట్ విషయంలో లేట్‌ చేయడంతో ఈ ప్రాజెక్టు పక్కకు వెళ్ళింది. ఇక మొదట్లో ఆదిత్య 999 సీక్వెల్ కి ముహూర్తం పెట్టినా.. అది కూడా వాయిదా పడింది. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ డెబ్యూ మరికాస్త ఆలస్యం అయ్యేలా ఉందని సమాచారం.