దర్శక ధీరుడు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29పై అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి విపరీతమైన అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న ఈ పాన్ వరల్డ్ సినిమాకు మెల్లమెల్లగా అడుగులు దగ్గర పడుతున్నాయి. డిసెంబర్లో సినిమా ప్రకటన చేసి జనవరి మొదటి నుంచి షూట్ ప్రారంభించాలని ప్లాన్లో ఉన్నారు మేకర్స్. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ఇమేజ్ ఆస్కార్ అవార్డుతో టాలీవుడ్ నుంచి జపాన్ వీధుల వరకు పాకిపోయింది. ఈ క్రమంలోనే జక్కన్న నుంచి రానున్న ఎక్స్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29 బిజినెస్ కు ఆకాశమే హద్దుగా మారనుంది. ఇక ఈ స్టోరీ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగుతుందని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే దీనిపై పూర్తిస్థాయి క్లారిటీ లేదు. ఇలాంటి క్రమంలో రాజమౌళి ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆర్ఆర్ఆర్ కంటే ఎస్ఎస్ఎంబి 29లో ఎక్కువగా జంతువులని వాడబోతున్నాం అంటూ చెప్పడం ఫ్యాన్స్లో ఆత్రుతను పెంచేస్తుంది. ట్రిపుల్ ఆర్ ఎపిసోడ్ జూనియర్ ఎన్టీఆర్ అడవి జంతువులను బోన్లో నుంచి దించుతూ తాను కూడా దూకిన సీన్ ఏ రేంజ్ లో ఎలివేట్ అయిందో ఎంత హైలెట్గా నిలిచిందో తెలిసిందే. అంతేకాదు ఎన్టీఆర్ ఇంట్రడక్షన్.. టైగర్ ఫైట్ అయితే ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ మించిన సినిమా ఉండబోతుందంటూ.. ఏకంగా జంతు ప్రపంచమే సినిమాలో చూపించబోతున్నామంటూ గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చాడు.
హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఇండియానా జాన్సన్ విపరీతంగా ఇష్టపడే రాజమౌళి.. అలాంటి బ్యాక్ డ్రాప్లోనే మహేష్ కోసం సినిమాను తీయనున్నాడని.. అడవులు, జంతువులు, నిధినిక్షేపాలు, ఒళ్ళు గగ్గురుపొడిచే హీరో, విలన్ మధ్యన ఫైట్స్.. ఎన్నో అడ్వెంచర్స్ ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఎన్నో హైలెట్స్ ఉండనున్నాయి. ఇక విజయేంద్ర ప్రసాద్ బ్రెయిన్, రాజమౌళి టేకింగ్, దానికి తోడు ఆస్కార్ విన్నర్ కీరవాణి ఇచ్చే ఎలివేషన్స్ సెట్ అయితే.. థియేటర్లో బ్లాస్ట్ అవ్వడం కాయం అనడంలో సందేహం లేదు.