టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న తాజా మూవీ దేవర. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు కల్లగొట్టి సత్తా చాటుకుంది. ఇక త్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ సినిమాకు ఎవరు ఊహించని రేంజ్లో సక్సెస్ అందింది. ఇందులో తండ్రి కొడుకులుగా.. డ్యూయల్ రోల్ లో తారక్ అదరగొట్టాడు. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్, శృతి మరాఠీ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో ఆకట్టుకున్నారు.
ఈ సినిమాతో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ టాలీవుడ్కు హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ను కొట్టేసింది. అయితే దేవరకు ముందుగా అనుకున్న హీరోయిన్ జాన్వి కాదట. ఈ సినిమాకు మొదట ఓ పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ను తీసుకోవాలని భావించారట. కానీ.. అప్పటికే ఆమె చేతినిండా సినిమాలతో బిజీ ఉండడంతో సినిమాకు నో చెప్పేసిందని సమాచారం. తర్వాత ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.. జాన్వి కపూర్ను సజెస్ట్ చేయడంతో.. ఈ సినిమా జాన్వి దగ్గరకు వెళ్లిందట. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. గతంలోనే దేవర సినిమాల్లో నేషనల్ క్రష్ రష్మిక మందన నటించనుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
కానీ.. దీనిపై అప్పట్లో మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక.. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2తో ఆడియన్స్ను పలకరించింది. అలాగే రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్, యానిమల్ 2 లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే దేవరని రిజెక్ట్ చేసిందని టాక్. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవడంతో ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా ఎన్టీఆర్ పక్కన నటించే ఓ జాక్పాట ఆఫర్ ను మిస్ చేసుకున్నావ్ అంటూ.. నిజంగానే రష్మిక అన్లక్కి అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్.