అది గ‌మ‌నించి పవన్ సినిమాను ఆపేసిన చిరంజీవి.. కానీ డైరెక్టర్ కెరీర్ పోయిందే..

సినీ ఇండస్ట్రీలో దర్శకులుగా రాణించాలని ప్రతి ఏడాది ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. అదృష్టం కొద్ది కొందరు మాత్రమే అవకాశాలు దక్కించుకుంటారు. వారిలో అతి తక్కువ మంది మాత్రమే సక్సెస్ఫుల్ డైరెక్టర్లుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతూ ఉంటారు. రాజమౌళి మొదట బుల్లితెర డైరెక్టర్గా పనిచేసిన సంగతి తెలిసిందే. తర్వాత సినిమాలకు దర్శకుడుగా మారాడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమాలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీ నే ఏటుతున్నాడు. కానీ కాపుగంటి రాజేంద్ర అనే దర్శకుడు మాత్రం సినిమా నుంచి బుల్లితెరకు వెళ్లి అక్కడ వరుస సీరియల్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ కాపుగంటి రాజేంద్రప్రసాద్ ఎవరు.. అనుకుంటున్నారా. ఆయనే బుల్లితెరను షేక్ చేసిన కార్తీకదీపం సీరియల్ దర్శకుడు. రాజేంద్ర గతంలో పలు సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. కాగా సినిమాలన్నీ డిజాస్టర్ గా నిలవడంతో కెరీర్ దురదృష్టవశాత్తు విచిత్రంగా ముందుకు సాగల్సి వచ్చింది.

Remember her from Bavagaru Bagunnara? She just got elected as a MP from WB. : r/tollywood

రాజేంద్ర దాసరి నారాయణ దగ్గర శిష్యరికం తీసుకొని.. కెరీర్‌ను ప్రారంభించాడు. తన కెరీర్ గురించి ఆయన మాట్లాడుతూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాకు డైరెక్టర్ అవకాశం ఇచ్చింది అల్లు అరవింద్ గారని.. గీత బ్యానర్ పై డబ్బు భలే జబ్బు సినిమాను తెరకెక్కించా అది రీమేక్ మూవీ.. తమిళ్ లోను పెద్దగా ఆడలేదు. తెలుగులో క్లైమాక్స్ మార్చి ట్రై చేద్దామని అల్లు అరవింద్ గారు అడిగితే నేను ఓకే చేశా.. కానీ ఇక్కడ కూడా వర్కౌట్ కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఆ టైంలో మన కాంబినేషన్లో మరో సినిమా ఉంటుందని మాట ఇచ్చారని.. అయితే సెకండ్ మూవీగా ఎలాంటి కథ చేయాలి అని చర్చ సాగుతున్న క్రమంలో ఓ పాయింట్ ఫిక్స్ అయ్యా. హీరోయిన్ ఇంట్లోకి హీరో ఫేక్ అల్లుడుగా వెళితే ఎలా ఉంటుందని పాయింట్ తో కథ రాశా. ఆ కథల్ని మొదటి పవన్ కళ్యాణ్ తో చేద్దామని అల్లు అరవింద్ గారు చెప్పారు.

పవన్ కళ్యాణ్ కు అప్పటికి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత సినిమాలు పూర్తయ్యాయి. పవన్ కళ్యాణ్ కూడా క‌థ‌ ఓకే అనుకున్నారు. మరోవైపు పవన్ తొలిప్రేమ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కానీ.. నాగబాబు, చిరంజీవితో ఓ సినిమా ప్లాన్ చేశారు. ఆ సినిమానే బావగారు బాగున్నారా.. ఇక ఈ సినిమా వెంటనే షూట్ మొదలెటేసి.. ఆ స్టోరీని కదా అల్లు అరవింద్ కి చెప్పారట. అందులో కూడా చిరంజీవి ఓపెద్ద ఇంటికి ఫేక్ అల్లుడు గా వెళ్ళాడు. మిగిలిన కథంతా వేర అయినా అసలు పాయింట్ ఒకటే కావడంతో చిరంజీవి గారి ఆధ్వర్యంలో పంచాయతీ మొదలైంది. నాగబాబు అప్పుడప్పుడే అంజ‌న ప్రొడక్షన్ సంస్థని డెవలప్ చేసుకుంటున్నాడు. నేను నా తమ్ముడు ఓకే కదా చేస్తే ఆడియన్స్ ఒప్పుకోరు. మీ కథ కూడా బాగుంది. కనుక ఎవరో ఒకరు డ్రాప్ అవ్వక తప్పదు. గీతా ఆర్ట్స్‌లో చాలా సినిమాలు ఉన్నాయి.

Geetha Arts Has no Hit with Pawan? | cinejosh.com

అంజనా ప్రొడక్షన్ కొత్త బ్యానర్ కాబట్టి మీరే డ్రాప్ అవ్వండి అని చిరంజీవి గారు రిక్వెస్ట్ చేశారు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ తో నేను చేయాల్సిన సినిమా ఆగిపోవడం.. బావగారు బాగున్నారా రిలీజై సూపర్ సక్సెస్ అందుకోవడం జరిగింది. తర్వాత పవన్తో సినిమా మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించాలి అనుకున్న వర్కౌట్ కాలేదు. అలా పవన్తో సినిమా చేయకుండా ఆగిపోయా అని రాజేంద్రప్రసాద్ వివరించారు. తర్వాత నాకు అవకాశాలు రావడం కష్టమైపోయిందని.. సినిమా కష్టాలు ఎన్నో అనుభవించా.. తర్వాత మోహన్ బాబు గారి నుంచి పిలుపు వచ్చింది. నా దగ్గర ఒక కథ ఉందని వివరించా. నాతో సినిమా చేయమని మోహన్ బాబు గారు అంటే.. ఆ కథను మంచు విష్ణు తో చేద్దాం అనుకుంటున్నా అని వివరించా. అయితే అంతకుముందే ఈ కథను రవి రాజా పినిశెట్టి విని నాకు ఈ స్టోరీ ఇవ్వు. నా డైరెక్షన్లో తెర‌కెక్కిస్తా అని అడిగార‌ని.. మోహన్ బాబుకు చెప్పా.

Shiva Shankar Telugu Full Length Movie || Mohan Babu, Soundarya & Geeta

వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఇంతలో మోహన్ బాబు మరో కథ నా దగ్గరకు తెచ్చి ఈ సినిమాకు డైరెక్ట్ చెయ్ అని అడిగారు. అదే శివ శంకర్‌. 70 శాతం షూటింగ్ పూర్తయింది. ఇక సాధారణంగా అయితే షూటింగ్ రోజుల్లో ఏ ఆర్టిస్ట్ కి మోహన్ బాబు గారు పర్మిషన్ ఇచ్చేవారు కాదు. చాలా స్ట్రిక్ట్ గా ఉండే ఆయ‌న‌ రెండు రోజుల ఎలక్షన్ ప్రచారానికి అని సౌందర్య పర్మిషన్ అడిగితే ఓకే చెప్పారు. ఆరోజు మోహన్ బాబు గారు నో చెప్పి ఉన్నా.. సౌందర్య బ్రతికి ఉండేదేమో. కానీ.. సౌందర్య కదా అని మోహన్ బాబు గారు ఓకే చెప్పారు. అప్పుడే ఆమె హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయింది. నాకు సినిమాలు అచ్చిరావు అనేదానికి ఇది ఉదాహరణ. ఇక‌ సౌందర్య మరణంతో క్లైమాక్స్ మొత్తాన్ని మార్చేయేల్సి వచ్చింది. కథ మొత్తం మార్చాలంటే అప్పటికి 70% షూట్ పూర్తయింది. అది జరగని పని. దీంతో క్లైమాక్స్ మార్చి రిలీజ్ చేసాము. ఊహించినట్టుగానే సినిమా డిజాస్టర్ అయింది అంటూ కాపుగంటి రాజేంద్రప్రసాద్ వివరించారు. సౌందర్య మరణంతో నా కెరీర్ నాశనం అయ్యింద‌ని సినిమాలు మనకు వద్దని బుల్లితెరకు వచ్చి సెటిలైపోయినట్లు రాజేంద్రప్రసాద్ వెల్లడించాడు. ఇక ఆయన నుంచి వచ్చిన కార్తీకదీపం టిఆర్టి రేటింగ్స్ తో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.