సినీ ఇండస్ట్రీలో హీరో సినిమాకు మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడమనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా విజయ్ దేవరకొండ సినిమాకు ప్రస్తుతం తారక్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అంటూ వార్త వైరల్ అవుతుంది. గతంలో ఎన్టీఆర్ ఇలా ఎన్నో సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అదే రీతిలో మరోసారి తన వాయిస్ను ఎన్టీఆర్.. విజయ్ దేవరకొండ సినిమాకు ఇవ్వనున్నాడట. ఎన్టీఆర్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే గొంతులో గాంభిర్యం.. ప్రస్తుతం ఉన్న హీరోల అందరిలో గంభీరమైన గొంతు ఎవరికి ఉంది అంటే టక్కున వినిపించే సమాధానం ఎన్టీఆర్, ప్రభాస్. అదే నిజం కూడా. కనుక ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తే సినిమా ఓ లెక్కలో ఉంటుందనేది వాస్తవం.
అందుకే తమ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఎన్టీఆర్ను సెలెక్ట్ చేసుకున్నారని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేమ్ గౌతం తిననూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ వాయిస్ తోనే ఈ సినిమా మొదలవుతుందట. వాయిస్ ఓవర్ కోసం పలువురు స్టార్ హీరోలను అనుకున్న యూనిట్.. చివరకు ఎన్టీఆర్ను ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్లో విజయ్ దేవరకొండ కంప్లీట్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో షార్ట్ హెయిర్, గడ్డంతో కనిపించడు.
విజయ్ దేవరకొండ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వీడీ12 టైటిల్ తో సూర్యదేవర నాగావంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సీతార ఎంటర్టైన్మెంట్స్ తో ఎన్టీఆర్కు మొదటి మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలో వీడీ12కు ఎన్టీఆర్ తో వాయిస్ ఓవర్ ఇప్పించాలని నిర్ణయించుకున్నారట. ఇక ఈ మూవీ 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా నిర్మాణ సంస్థ అఫీషియల్ గా ఈ డేట్ ని అనౌన్స్ చేసింది. ఇక ఈ సినిమా ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకున్న క్రమంలో.. దేవరకొండ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందించడం.. అలాగే ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అనడంతో సినిమాపై ప్రేక్షకుల్లో కొంతమేరకు అంచనాలు పెరిగాయి. అయితే తారక్ ఫ్యాన్స్ మాత్రం దేవర కొండపై ఫైర్ అవుతున్నారు. ఇదెక్కడి దరిద్రం రా బాబు.. మా అన్న ఆ దేవరకొండ గాడికి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఏంటి అంటూ.. నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.