టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు అసలు ప్రేక్షకులు ఊహించని విధంగా తెరకెక్కుతూ ఉంటాయి. అలాంటి కాంబినేషన్స్ సెట్స్ పైకి వచ్చి రిలీజ్ అవుతున్నాయి అంటే.. అభిమానుల్లో ఉండే ఆశక్తి వురే లెవెల్లో ఉంటుంది. ఇక ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తారక్ షూట్ పూర్తి చేసుకున్న దేవర.. ఈ ఏడాది సెప్టెంబర్ నెలాకరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2025లో తారక్ మరోసారి వార్2 సినిమాతో ఆడియ్స్ను పలకరించయున్నాడు. ఇక 2026 సంక్రాంతి కానుక ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్ కు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ నెటింట వైరల్గా మారింది. తారక్.. కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి డైరెక్షన్లో ఓ సినిమా నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కాంతారా సినిమాలో అద్భుతమైన నటనకు తాజాగా జాతీయ అవార్డు దక్కించుకున్నాడు రిషబ్ శెట్టి.. ఈ నేపధ్యంలో రిషబ్ శెట్టికి అవార్డు రావడం పై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. దీంతో రిషబ్, తారక్ల మధ్యన మంచి బాండింగ్ ఏర్పడిందన్న సంగతి క్లియర్గా తెలుస్తోంది. ఇద్దరు హీరోల కాంబినేషన్లో సినిమా తెరకెక్కితే అభిమానుల్లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి. మరి ఈ కాంబినేషన్లో నిజంగానే సినిమా తెరకెక్కుతుందా.. లేదా.. తెలియాలంటే అభిమానులు మరికొంత కాలం వేచి ఉండక తప్పదు. అయితే నిజంగానే వీరిద్దరి కాంబోలో సినిమా రిలీజ్ అయితే మాత్రం అది కచ్చితంగా బాక్స్ ఆఫీస్ను బ్లాస్ట్ చేయడం ఖాయం అంటూ అభిప్రాయాలు వెల్లువవుతున్నాయి. తారక్ – రిషబ్తో ప్రాజెక్టును అనౌన్స్ చేస్తే మాత్రం సినిమా ఖచ్చితంగా సంచలనగా మారుతుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం క్రేజ్ పరంగా పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న తారక్.. తన నెక్స్ట్ సినిమాతో బాక్సాఫీస్ ని బ్లాక్ చేయడం పక్క అంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రూ.100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న తారక్.. రాబోయే రోజుల్లో ఇంకెన్ని క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తాడో వేచి చూడాలి.