సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత చాలా మంది యాడ్ ప్రమోషన్స్ ద్వారా కూడా భారీ రెమ్యునరేషన్ సంపాదిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు ఏదో ఒక బ్యూటీ ప్రోడక్ట్.. లేదా మరింకేదైనా ప్రోడక్ట్ను ప్రమోట్ చేస్తూ ఆదాయాన్ని అర్జించడంతోపాటు.. మంచి ఫేమ్ కూడా సంపాదించుకుంటూ ఉంటారు. అలా తాజాగా టాలీవుడ్కు చెందిన ఒకప్పటి క్రేజీ హీరోయిన్ నటించిన యాడ్ ఫొటోస్ నెటింట వైరల్గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లతో పాటు.. అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. తమ ఫేవరెట్ బ్యూటీ యాడ్స్లో కూడా నటించిందా అంటూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ యాడ్ ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఇప్పటికీ ఈ అమ్మడు.. సోషల్ మీడియాలో మంచి పాపులారిటీతో దోసుకుపోతుంది. రోజు చూసే అభిమానులైతే ఈమెను ఇట్టే గుర్తుపడతారు.. ఆమె మరెవరో కాదు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్. ఇండస్ట్రీలోకి రాకముందు రేణు దేశాయ్ మోడలింగ్లో రాణించింది. అందులో భాగంగానే పియర్స్ సోప్ యాడ్ కోసం నటించి మెప్పించింది. అప్పటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. ఇక మోడల్గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్.. ఫస్ట్ సినిమాతోనే పవన్ కళ్యాణ్ తో కలిసి బద్రి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా షూట్ టైంలో పవన్తో ప్రేమలో పడిన రేణుదేశాయ్ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి జానీ సినిమాలోని నటించింది. అయితే తమిళ్లోను రేణుదేశాయ్.. జేమ్స్ పండు సినిమాలో నటించి ఆకట్టుకుంది.
ఇక తర్వాత పవన్ కళ్యాణ్ను ప్రేమించి వివాహం చేసుకున్న రేణు ఇండస్ట్రీకి దూరమైంది. అయితే కేవలం నటిగానే కాదు నిర్మాతగా, డైరెక్టర్గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మారాఠీ మూవీ ఇస్క్ వాలా లవ్ అనే సినిమాకు దర్శకురాలుగా వ్యవహరించింది. ఈ సినిమాకు ప్రొడ్యూసర్గాను అమ్మడు పనిచేసింది. ఇక చాలా కాలం క్యాప్ తర్వాత తాజాగా మరోసారి మాస్ మహారాజు రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరావు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్లో ప్రారంభించింది. ఇందులో హేమలత లవణం అనే పాత్రను పోషించిన రేణుదేశాయ్.. తన నటనకు మార్కులు కొట్టేసింది. దీంతో మళ్ళీ ఆమె పలు సినిమాల్లో బిజీ అవుతుందని అంత భావించారు. కానీ ఈ సినిమా తర్వాత రేణు దేశాయ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన పిల్లలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.