ప్రస్తుతం సౌత్ సీన్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ల ట్రెండ్ మొదలైన సంగతి తెలిసిందే. ఎప్పుడో గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ టైంలో మల్టీ స్టారర్ల హవా నడిచేది. అయితే కొంతకాలానికి మల్టీ స్టారర్లు ఆగిపోయాయి. మళ్ళీ సినీ లవర్స్ కు మల్టీస్టారర్ల రుచి చూపించేలా మాల్టీ స్టారర్ ట్రెండ్ను ప్రారంభించాడు శ్రీకాంత్ అడ్డాల. మహేష్ బాబు, వెంకటేష్ కాంబోలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా తర్వాత మరోసారి తెలుగులో మల్టీ స్టారర్ల ట్రెండ్ మొదలైంది. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరూ కలిసి సినిమాలు చేయడం మొదలుపెట్టారు.
ఈ నేపద్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి బాలయ్య కాంబోలో ఒక సినిమా వస్తే బాగుంటుందంటూ ఎంతో కాలంగా నందమూరి అభిమానులతో పాటు.. ఇటు మెగా అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరికి సరిగ్గా సెట్ అయ్యే ఒక కథను.. ఓ డైరెక్టర్ సిద్ధం చేశాడట. నిర్మాత దగ్గరకు ఆ కథను తీసుకువెళ్లగా.. ఆ కథ విన్న నిర్మాత చాలా బాగుంది.. వెంటనే ఈ కథ వారికి చెప్పి ఓకే చేపించండి. ఇది కచ్చితంగా వారు ఓకే చేస్తారంటూ చెప్పారట. ముందుగా బాలకృష్ణకు కథ చెబుదామని వెళ్లిన డైరెక్టర్.. తర్వాత పవన్ కళ్యాణ్ కు కథ చెబుదామని ఫిక్స్ అయ్యారట.
అయితే బాలకృష్ణకు కథ చెప్పేటప్పుడు డైరెక్టర్ కాస్త తడబడడంతో.. కథలో క్లారిటీగా అనిపించలేదని.. దీంతో బాలయ్య ఇదేం కదా నాకు నచ్చలేదంటూ రిజెక్ట్ చేశాడట. ఇక పవన్ కళ్యాణ్ వరకు కథ వెళ్లకముందే సినిమా ఆగిపోయింది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాత రెడీగా ఉన్నా బాలయ్య సినిమాలో నటించడానికి ఇష్టపడలేదట. ఇలా కేవలం డైరెక్టర్ కథ చెప్పే సమయంలో చేసిన ఆ చెత్త మిస్టేక్ కారణంగా వీరిద్దరి కాంబోలో రావాల్సిన సినిమా ఆగిపోయింది. అయితే నిర్మాత మాత్రం కథలో చిన్న మార్పులు, చేర్పులు చేసి మరోసారి బాలయ్యకు వినిపించమని డైరెక్టర్కు సజెషన్ ఇచ్చాడట. డైరెక్టర్ ఈసారైనా బాలయ్యతో ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకుంటాడేమో.. ఈ కాంబో ఎప్పటికి సెట్స్పైకి వస్తుందో వేచి చూడాలి.