“ఎన్టీఆర్ కన్నా బెటర్ గా ఆ పని చేస్తా”.. హీట్ పెంచేస్తున్న మోడీ కామెంట్స్ ..!

నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి .. ఈ సందర్భంగా చాలా మంది ప్రముఖులు ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. నందమూరి అభిమానులు.. నందమూరి కుటుంబ సభ్యులు ..శ్రేయోభిలాషులు ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళులర్పించారు . ఉదయం తెల్లవారుజామున ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఫొటోస్ మనం నెట్టింట వైరల్ కావడం చూసాం.

ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సైతం తండ్రికి నివాళులర్పించారు. కాగా సోషల్ మీడియా వేదికగా చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – వెంకయ్య నాయుడు.. చంద్రబాబు.. లోకేష్ తదితరులు ఆయనను స్మరించుకున్నారు . కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఎన్టీఆర్ ని గుర్తు చేసుకున్నారు . తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ విశిష్ట నటుడు అని కొనియాడారు .

అంతేకాదు సినీ రాజకీయ రంగాలకు ఎన్టీఆర్ అందించిన సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకంగా మారుతాయి అన్నారు. ఎన్టీఆర్ కన్నా సమాజం కోసం నిరంతరం పనిచేయడానికి కృషి చేస్తామన్నారు . ఇది ఇలా ఉండగా సినీ రాజకీయ రంగాలలో ఎనలేని కృషి చేసిన ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి . తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం అదే డిమాండ్ చేశారు..!!