టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె గానం తెలియని వారంటూనే ఉండరు. ఈమె మొదటి భర్తతో విడిపోయి వరుస వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే 42 ఏళ్ల వయసులో ఆమె వ్యాపారవేత్త రామ్ ని వివాహం చేసుకుంది.
పెళ్లయ్యాక సునీత ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. పెళ్లీడుకొచ్చిన కూతురు, కొడుకు ఉండగా నీకు పెళ్లి అవసరమా? అంటూ పలువురు ట్రోల్స్ సైతం చేశారు. అయినప్పటికీ సునీత అవేవీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోయింది.
ఇక ఈమె రామ్ ను పెళ్లి చేసుకుని 3 సంవత్సరాలైన సందర్భంగా సునీత సోషల్ మీడియా వేదికగా రామ్ తాళి కడుతున్న పిక్ షేర్ చేసి..” ఈ క్షణం నా జీవితం సంతోషమయంగా మార్చేసిందని ” ఫోటో కింద క్యాప్షన్ రాసుకు వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది.
View this post on Instagram