బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రణబీర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ సినిమాతో బోల్డ్ బ్యూటీగా భారీ పాపులార్టిని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన అయినా.. రష్మిక పేరును పక్కనపెట్టి తృప్తి దిమ్రిని తమ క్రష్ గా కుర్రకారు మార్చేశారు.
ఇక ఈ సినిమా లో టూ హాట్ గా కనిపించి కుర్రాళ్లను కవ్వించిన తృప్తి ప్రస్తుతం యానిమల్ సక్సెస్ నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలో సందడి చేస్తుంది. కాగా ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. అందులో భాగంగా మీరు సౌత్లో ఏ హీరోతో నటించాలని భావిస్తున్నారు అని అడగగా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పింది. ఇప్పటికే సందీప్ రెడ్డి, ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీకి తృప్తి దిమ్రి హీరోయిన్గా సెలెక్ట్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్తో సినిమా చేయాలనుంది అని చెప్పడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే స్పిరిట్ లో ప్రభాస్ సారసన నటిస్తుందంటూ వార్తలు వినిపించాయి. అయితే స్పిరిట్ లో ప్రభాస్ సరసన ఈ హాట్ బ్యూటీ నటిస్తుందన్న అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. కాగా తృప్తి ఎన్టీఆర్ పేరు చెప్పడంతో మా ఎన్టీఆర్ అన్న పై కన్నేసావ జోయా పాప అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.