2023లో టాలీవుడ్‌లో కాంట్ర‌వ‌ర్సీలుగా మారిన ఎన్టీఆర్‌, అన‌సూయ‌, సామ్‌…!

సినీ ఇండస్ట్రీలో అయినా, రాజకీయాల్లో అయినా.. విభేదాలు అనేవి సాధారణం. అయితే ఈ ఏడాది (2023) లో కొన్ని గొడవలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఆ గొడవల్లో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, సమంత, దిల్ రాజు, అనసూయ, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌ సైతం ఉన్నారు. బోల్డ్ బ్యూటీ అనసూయ కాంట్రవర్సీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లేడీ హీరో విజయ్ దేవరకొండ తో ఖుషి సినిమా పోస్టర్ పై ” ది విజయ్ దేవరకొండ ” అని రాయడాన్ని అనసూయ ఇన్ డైరెక్ట్ గా ఎగతాళి చేసింది.

దీంతో రెడ్డి హీరో అభిమానులు హార్ట్ అవ్వడంతో ఈమని దారుణంగా ట్రోల్స్ చేశారు. ఇక సమంత హెల్త్ ఇష్యూ పై ప్రొడ్యూసర్ చిట్టిబాబు ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.‌ ” ఈమె ప్రతి మూవీ రిలీజ్ కు ముందు సింపతి కోసమే ఇలా చేస్తుంది అని… సమంత స్టార్ డం ఎప్పుడో క్లోజ్ అయిపోయింది.. ఇంకా ఈమెకు అవకాశాలు రావని ” చిట్టిబాబు కామెంట్స్ చేశాడు. ఇక దీంతో సమంత …” వయసు పెరిగితే కొందరు మగవాళ్ళ చెవుల్లో వెటకారాలు పెరుగుతాయి.

డాక్టర్స్ దానికి టెస్టోస్టిరాన్ కారణమని చెబుతారు. అవి తొలగించుకుంటే మంచిది ” అని పోస్ట్ పెట్టి రివర్స్ కౌంటర్ వేసింది సామ్. ఇక ఈ వివాదంతో ఈమె కూడా ఈ ఏడాది వివాదాల్లో చిక్కుకుంది. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్టుపై మాట్లాడలేదని జూనియర్ ఎన్టీఆర్ ని సైతం ఓ రేంజ్ లో వేసుకుంది సోషల్ మీడియా. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ వివాదంతో ఏడాది కాంట్ర‌వ‌ర్సీలుగా మారాడు. ఇక వీరు మాత్రమే కాకుండా చాలామంది సినీ సెలబ్రిటీలు ఈ ఏడాది వివాదాల్లో చిక్కుకున్నారు.