మెగా హీరో వరుణ్, స్టార్ హీరోయిన్ లావణ్య కొంతకాలంగా ప్రేమించుకుంటూ.. తాజాగా పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట… నవంబర్ 1న ఇటలీలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. అనంతరం హైదరాబాదులో రిసెప్షన్ సైతం ఏర్పాటు చేసుకున్నారు.
ఈ రిసెప్షన్ కి ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. తాజాగా సాయి ధరమ్ తేజ్, వరుణ్ ని అందరి ముందే నిలదీసిన ఓ ఫోటో ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇటలీలో పెళ్లి మండపానికి వరుణ్ తేజ్ వస్తుండగా సాయి ధరమ్ తేజ్ అతడిని ఆపి నట్టుగా కనిపించింది.
ఆ తర్వాత అందరి ముందే కారుపై కాలు పెట్టి..” ఎందుకు వరుణ్ బాబు ఇంత పని చేశావ్ ” అని అడిగాడు. దీంతో అది చూసిన ప్రేక్షకులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram