తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం.. ప్ర‌ముఖ‌ సినీ న‌టుడు మృతి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటికి నిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో షోలలో మెప్పించిన జూనియర్ బాలయ్య మృతి చెందారు. ఇక తాజాగా మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ యాక్టర్ ఈశ్వరరావు కన్నుమూశారు. మిచిగాన్‌లోని తన కూతురి ఇంటికి వెళ్లిన ఆయన అనారోగ్య కారణంగా మృతి చెందాడు. గత నెల 31న ఈయన మరణించగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

స్వర్గం – నరకం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈశ్వరరావు దాసరి నారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈశ్వరరావు తన సినీ కెరీర్ మొత్తంలో 200 పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈశ్వరరావు ఈ సినిమాకు కాంస్య‌ అంది అవార్డును కూడా గెలుచుకున్నాడు.

ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. దేవతలారా దీవించండి , బ్లాక్ బస్టర్ హిట్ ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, జయం మనదే, శభాష్ గోపి అలాగే మెగాస్టార్ బ్లాక్ బాస్టర్ హిట్ అయినా ఘరానా మొగుడు లాంటి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక చివరిగా చిరంజీవి ఘరానా మొగుడు సినిమాలో కనిపించిన ఈయన తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇక ప్ర‌స్తుతం ఈశ్వరరావు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్ర‌క‌టించారు.