ఏకంగా అన్ని సంవత్సరాల తరువాత ఒకే స్టూడియోలో కలిసిన లెజెండ్రీ యాక్టర్స్… చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదుగా…!!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో.. రజనీకాంత్, కమల్ హాసన్ ఒకరు. ఇక వీరుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా వీరిద్దరూ ఒకే స్టూడియోలో తన సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ లో పాల్గొన్నారు. శంకర్ దర్శకత్వంలో కమల్ ” ఇండియన్ 2 ” షూటింగ్ చెన్నైలోని ప్రసాద్ స్టూడియో ఎరీనాలో జరుగుతుంది.

ఇక ఇక్కడే తలైవా హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ” తలైవర్ 170 ” సినిమా చిత్రీకరణ కూడా మొదలైంది. అయితే తన షూటింగ్ స్పాట్ కి సమీపంలోనే కమల్ ఉన్నాడని తెలుసుకున్న రజినీకాంత్… తన మిత్రుడిని కలవడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న లోకనాయకుడు ఆయన కన్నా ముందే షూటింగ్ స్పాట్ కి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చాడట.

ఇక ఇద్దరూ ఒకే స్టూడియోలో కలుసుకోవడం, షూటింగ్స్ జరుపుకోవడం జరిగి 21 సంవత్సరాలు అయ్యిందట. మొత్తానికి ఒకరినొకరు కలుసుకుని గత సంతోషాలను గుర్తు చేసుకున్నారట. ఇక వీరిద్దరిని చూసిన ప్రేక్షకులు…” ఈ స్టార్స్ ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు ” అంటూ కామెంట్లు చేస్తున్నారు.