తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది యాంకర్లు మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలానే టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్స్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేవారు సుమా, శ్రీముఖి, అనసూయ, రష్మీ , ప్రదీప్. వీరందరూ కూడా తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. చాలామందికి వీరి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే సందేహం ఉంటుంది. వీరి బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1. సుమ:
సుమ కేరళకు చెందిన అమ్మాయి అయినప్పటికీ తన తండ్రి వృత్తిరీత్యా సికింద్రాబాద్లో స్థిరపడ్డారు. అందుకే సుమ తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ గా స్థిరపడడానికి సాధ్యమైంది. ముందు చిన్నచిన్న షోలను చేసినప్పటికీ.. ప్రస్తుతం ప్రతి ఫంక్షన్ కి ఈమె యాంకరింగ్ చేస్తుంది.
2. శ్రీముఖి:
బుల్లితెర రాములమ్మగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన శ్రీముఖి తెలుగు అమ్మాయి. ఈమె అసలు ఊరు నిజామాబాద్. శ్రీముఖి తండ్రి డిగ్రీ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ గా పని చేశారు. ఇక ఈమె తల్లి ఓ బ్యూటిషన్. ఇలా ఉన్నతమైన కుటుంబానికి చెంది.. యాంకర్ అవ్వాలని ఆశతో సీని రంగంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం వరుస షోలకు యాంకరింగ్ చేస్తూ, కొన్ని సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది.
3. అనసూయ:
జబర్దస్త్ యాంకర్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమై…. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది అనసూయ. ఈమె పుట్టింది విశాఖపట్నం. పెరిగింది మాత్రం హైదరాబాద్. ముందు ఈ ముద్దుగుమ్మ టీవీ యాంకర్ గా చేసేది. అనంతరం యాంకరింగ్ మీద ఇష్టం ఉండడంతో.. జబర్దస్త్ ద్వారా బుల్లితెరకి పరిచయమైంది. ప్రస్తుతం వెండితెరలో దూసుకుపోతుంది.
4. రష్మీ:
టాలీవుడ్ యాంకర్లలో ఈమె కూడా స్టార్ యాంకర్ గా నిలిచింది. ఈమె తల్లిదండ్రులు తెలుగువారు కాకపోయినప్పటికీ… ఈ ముద్దుగుమ్మ విశాఖపట్నంలో పెరగడంతో.. ఈమెకి తెలుగు అలవాటయింది. రష్మీ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కూడా వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
5. ప్రదీప్:
చాలా ఫన్నీగా యాంకరింగ్ చేస్తూ ఎంతోమంది అభిమానులని ఆకట్టుకున్న యాంకర్లలో ప్రదీప్ ఒకడు. ఈయన పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాదులోనే. ఇక ఈయన కూడా యాంకరింగ్ మీద మక్కువ ఉండడంతో.. బుల్లితెరపై అడుగుపెట్టాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో, యాంకరింగ్ లతో దూసుకుపోతున్నాడు.
ఇలా యాంకర్స్ గా తమ సత్తా చాటుకుంటూ.. తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. వీరంతా కేవలం యాంకరింగ్ కే పరిమితం కాకుండా.. సినిమాలలో సైతం నటిస్తూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటున్నారు.