కోలీవుడ్ స్టార్ హీరో విశాల్కు టాలీవుడ్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోట్లాదిమంది ప్రేక్షకులను అభిమానాన్ని సొంతం చేసుకున్న విశాల్ ఇటీవల మార్క్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్నాడు. అయితే విశాల్ ఎవరికైనా కష్టం వస్తే ఆదుకునే విషయంలో ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటాడని సంగతి తెలిసిందే. తాజాగా విశాల్ షూటింగ్ కు వెళ్లిన ఓ గ్రామంలోని గ్రామస్తుల అవసరాలను తీర్చి మంచి మనసును చాటుకున్నాడు. విశాల్ ఆ గ్రామస్తుల దాహార్తిని తీర్చాడు.
నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి హీరో విశాల్ సమాజ సేవ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నాడు. విశాల్ దేవి ఫౌండేషన్ విడుదల చేసిన ఫోటోల ద్వారా ఈ విషయాలు వెళ్లడయ్యాయి. కుమారచక్రపురం అనే గ్రామానికి వెళ్ళిన విశాల్ ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య ఉందని తెలుసుకున్న బోరుబావిని తవ్వించడంతోపాటు 5000 లీటర్ల సామర్థ్యం ఉన్న రెండు సిందటికి వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేశాడు. ఆరు ట్యాప్ల ద్వారా నీళ్లు పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తాడు. త్రాగునీటి సమస్యను తీర్చడంతో గ్రామ ప్రజలు విశాల్కు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను చేయాలంటూ.. విశాల్ గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇక ఇతర హీరోలకు భిన్నంగా విశాల్ ఎప్పుడూ తన మంచి మనసును చాటుతూనే ఉంటాడు. అయితే సినిమాల విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా విశాల్ రెమ్యూనరేషన్ భారీ రేంజ్ లో పెరిగిందట. తమిళంలో విశాల్ సినిమాలో సక్సెస్ సాధిస్తున్న.. గతకొంతకాలంగా తెలుగులో మాత్రం ఆ మ్యాజిక్ ను చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు విశాల్. తెలుగు హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు నటిస్తే బాగుంటుంది ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం విశాల్ హరి డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.