దేశంలోనే అత్యధిక ఖరీదైన బర్త్డే పార్టీ ఇదే.. బ‌డ్జెట్ ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

రాజులు – రాణులు కూడా ఎన్నడు జరుపుకోని రేంజ్ లో గ్రాండ్ గా పుట్టినరోజు వేడుకలు జరిగాయి వేదిక పైకి కింగ్ ఖాన్, బిగ్ బి, ఏ ఆర్ రెహమాన్ లాంటి ఎందరో ప్రముఖులు విచ్చేసారు. ఏఆర్ రెహమాన్ లైవ్ షో తో పాటు ఇండియా స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా లైవ్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ వేదికపై జరిగింది. ఇక‌ ఈ పుట్టినరోజు వేడుకలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టినరోజు వేడుకలుగా రికార్డ్ సృష్టించుకున్నాయి. ఇంతకీ ఎవరిదా పుట్టిన రోజు.. ఏంటా రికార్డ్‌.. ఒకసారి చూద్దాం. ప్రపంచంలోనే నెంబర్ వన్ రిచెస్ట్ పర్సన్ గా రికార్డులు సృష్టించిన బిజినెస్ మ్యాన్‌ ముఖేష్ అంబానీ కుటుంబంలో జరిగిన పుట్టినరోజు వేడుకల గురించే ఈ హంగామా అంతా.

 

ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ 50వ‌ పుట్టినరోజు వేడుకలు అప్పట్లో ఘనంగా జరిగాయి. రాజస్థాన్లోని జోధాపూర్ ఆరోజు అంగరంగ వైభవంగా ముస్తాబైంది. గత సార్వత్రిక ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు భారతదేశంలో ఈ వేడుక జరిగింది. ఈ పండుగకు హాజరు కావడానికి భారతదేశ ప్రముఖులంతా ప్రైవేటు జ‌ట్లలో వచ్చారు. ఈ పుట్టిన రోజుకు భారతదేశపు అతిపెద్ద కంపెనీ చార్టెడ్ విమానంలో అంతా ప్రయాణించారు. నీతా అంబానీ 50వ‌ బర్త్డే సెలబ్రేషన్ కు వేదికగా అంబానీ ఇల్లు, రెండు రాజభవనాలను బుక్ చేసుకున్నారు. 300 మంది వీవీఐపీ అతిథులు హాజరైన ఈ వేడుకలకు గోద్రెజ్ లు, మహేంద్ర లు, అంబానీలు, ఎన్నో సంపన్న వ్యాపార కుటుంబాలు విచ్చేసాయి.

అలాగే సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టీమ్ ఆటగాళ్ళంతా ఈ ప్రముఖ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. అయితే ఈ వేడుకల్లో నీతా అంబానీ ముఖేష్ అంబానీలో కూతురు ఈషా అంబానీ కూడా ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది. ప్రముఖ వ్యాపార దిగ్గజం ధీరుభాయ్ అంబానికి గ్రేట్ లైఫ్ షో తో సన్మానం చేశారు. ఇక నీత పుట్టినరోజు వేడుకలు 31 అక్టోబర్ 2013 నుంచి నవంబర్ 1 వరకు ఘనంగా జరిగాయి. రెండు రోజులు పాటు ఘనంగా కొనసాగిన ఈ వేడుకల్లో హాజరైన సెలబ్రిటీస్ అంతా చిల్ అయ్యారు. ఈ వేడుకకు దాదాపు రూ.220 కోట్ల పైచిలుకు ఖర్చు చేశాడట అంబానీ. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైన పుట్టినరోజు వేడుకగా ఇది రికార్డు సృష్టించింది.