లెటర్ చదివి గుక్కపెట్టి ఏడ్చేసిన శోభ‌, యావ‌ర్‌… లేఖలో ఏం ఉందంటే..!

బిగ్‌బాస్ సండే ఎపిసోడ్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్‌తో పాటు భారీ ఎమోషన్ డ్రామాను క్రియేట్ చేశారు. తాజాగా హౌస్ లోని కంటెస్టెంట్లకు దసరా కానుకగా వారి ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయి. వాటిని చదివిన శోభ, యావర్, తేజ ఎక్కువ మొత్తంలోనే ఎమోషనల్ అయ్యారు. శోభ కోసం వారి తల్లిదండ్రులు ఉత్తరం రాసినట్లు అర్థం అవుతుంది. అమర్ కోసం కూడా తన భార్య తేజస్విని ఒక ఉత్తరం పంపించింది.

బిగ్ బాస్ హౌస్ లో దసరా పండగ వేడుకలు జరిగాయి. ఈ మేరకు హౌస్ లోని కంటెస్టెంట్లతో బతుకమ్మ ఆడించారు నాగార్జున. ఆపై వారితో కొన్ని సినిమా పాటలకు డ్యాన్సులు కూడా వేపించాడు. దసరా షోనీ 7 గంటలకే ప్రారంభించారు. దీంతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములను ఏర్పాటు చేశారు. పలు రియాలిటీ షోలలో పాల్గొన్న యంగ్ సింగర్స్ స్టేజ్ పైన పాటలు పాడారు.

ఆపై డింపుల్ హయతి , పాయల్ డాన్సులతో దుమ్మురేపారు. ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్ చదివిన శోభ మొదటిసారి ఎమోషనల్ అయింది. ఆ లేఖను ఆమె నాన్నగారు వ్రాసినట్లు తెలిపింది. అందులో ఆయన తెలిపిన వ్యాఖ్యలతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఈవారం పూజ ఎలిమినేట్ కాగా రతిక రీఎంట్రీ ఇచ్చింది.