మళ్లీ కలిసిన సమంత – నాగచైతన్య.. సమంత పోస్ట్ వైరల్..

గత కొన్ని రోజులుగా సమంత – నాగచైతన్య మళ్ళీ కలిసిపోయారు అంటూ న్యూస్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను చూసిన చాలామంది వాళ్ళు కలవక ముందే ఎందుకు కలుస్తున్నారు అంటూ ఇలా పిచ్చి న్యూస్ స్ప్రెడ్ చేస్తారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత – చైతన్య ఫ్యాన్స్ మాత్రం నిజంగా వాళ్ళు కలిస్తే బాగుండు అంటూ కామెంట్ చేశారు. అయితే వీరిద్దరూ మళ్ళి కలుస్తున్నారు అనే వార్తలు వైరల్ అవ్వడానికి కారణం సమంత దగ్గర ఉండే పెట్‌ డాగ్ హ్యాష్‌ చైతన్య దగ్గర కనిపించడమే. ఇక నాగచైతన్యకు కుక్కలు పెంచుకోవడం ఇష్టం లేకపోయినా సమంతతో పెళ్లి అయ్యాక సమంతతో అలవాటు పడిపోయాడు.

దాంతో ఎక్కడికి వెళ్లినా నాగచైతన్యతో ఆ కుక్క అప్పుడప్పుడు కనిపించేది. అలా వీరి విడాకులు అయ్యాక సమంత తన పెట్ ని కూడా తీసుకువెళ్తుంది.. అలాంటప్పుడు సమంత ప్రేమ పెంచుకున్న ఆ కుక్క నాగచైతన్య దగ్గర కనిపించడం ఏంటి అంటూ వార్తలు వినిపించాయి. ఇక తాజాగా ఓ వీడియోలో హ్య‌ష్ నాగచైతన్యతో కనిపించింది. దీంతో వీరిద్దరూ ఒకటవుతున్నారా అంటూ నటిజన్స్ లో అనుమానాలు మొదలయ్యాయి. అదే అనుమానాలను నిజం చేసేలా కొంతమంది నేటిజన్స్ వారిద్దరు కలిసిపోయారు అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

ఇక తాజాగా సమంత చేసిన ఓ పోస్ట్ తో వారిద్దరూ కలిసిపోయారు అంటూ వైరల్ అయిన న్యూస్ ఆమె వరకు వెళ్లిందేమో అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. దీనిపై ఆమె ప‌రోక్షంగా స్పందిస్తూ సాటారికల్‌గా పోస్ట్ పెట్టింది. తన సోషల్ మీడియా ఖాతాలో వస్తున్న వార్తలపై పరోక్షంగా పోస్ట్ పెడుతూ అందరూ ఇంత ఖాళీగా ఉన్నారని నేనైతే అనుకోలేదు.. ఖాళీగా ఉండే బదులు కనీసం ఏదైనా పుస్తకం చదువుకోండి జ్ఞానం పెరుగుతుంది అంటూ పోస్ట్ చేసింది. అర్థం చేసుకుంటే ఇది నాగచైతన్య – సమంత మళ్ళీ కలుసుకోబోతున్నారనే దానిపై సెటైర్ వేసే పోస్టులాగే కనిపిస్తుంది. ఇక సమంత పోస్ట్ తో వాళ్ళ‌ద‌రు కలిసిపోయారంటు వస్తున్న వార్తలకు చెక్‌ పెట్టింది.