వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ…!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ “వాల్తేరు వీరయ్య “. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత ఈ సినిమా ద్వారా తమ అభిమానులతో పాటు ఆడియన్స్ ని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు చిరు.

శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ గ్రాండ్గా నిర్మించింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కి తమ్ముడిగా మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్ర పోషించగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ విలన్ గా కనిపించాడు.

కాగా రిలీజ్ అనంతరం ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 23న సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ఆడియన్స్ ముందుకి రానుంది. మరి అటు థియేటర్స్ లో ఇటు ఓటీటీ లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న వాల్తేరు వీరయ్య టెలివిజన్ ప్రీమియర్ ద్వారా ఏ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి.