సాయి ధరమ్ తేజ్ పక్క మాస్ షేడ్ లో ” గాంజా శంకర్ ” ఫస్ట్ హై అదుర్స్‌…!!

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో ఓ మాస్ ఎంటర్టైనర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మరి ఇది తేజ్ కెరీర్ లో 17వ సినిమాగా తెరకెక్కుతుండగా ఈ సినిమా నుంచి అయితే మేకర్స్ ఈరోజు ఓ ఫస్ట్ హై ని లాంచ్ చేస్తున్నట్టుగా తెలిపారు.

మరి ఈ సినిమా పై మొదటి నుంచి కూడా ఉన్న మాస్ టైటిల్ ” గాంజా శంకర్ ” తోనే మేకర్స్ ఈ సినిమాని కన్ఫర్మ్ చేయగా పక్కా మాస్ షేడ్ లో అయితే తేజ్ ని దర్శకుడు సంపత్ నంది ప్రజెంట్ చేస్తున్నట్టుగా ఈ సినిమా మోషన్ పోస్టర్, టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఇక తనని ఇంట్రో చేసిన విధానం కానీ తేజ్ మేకోవర్ నెవర్ బిఫోర్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి.

అలాగే ఇందులో భీమ్స్ ఇచ్చిన స్కోర్ కూడా అదిరింది. మొత్తానికి అయితే ఒక మాస్ కోలాబరేషన్ లో సాలిడ్ ట్రీట్ ఇవ్వడానికి వీరు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ సినిమాకి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహించారు.